ఇలియానా ఎక్కడా తగ్గట్లేదుగా...!
on May 24, 2018
టాలీవుడ్ లో కోటి రూపాయలు తీసుకున్న మొట్ట మొదటి హీరోయిన్ ఎవరంటే ఇలియానా అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ గోవా భామ పోకిరీ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో ఒక్క నైట్ లో సూపర్ స్టార్ అయిపోయింది. అంతే ఆ తరువాత వరుస ఆఫర్లతో బిజీ అయిపోయింది. ఇక ఈ భామ కూడా కోటి రూపాయలు డిమాండ్ చేసేసింది. నిర్మాతలు కూడా ఇలియానాకు కోటి రూపాయలు ఇవ్వడంలో వెనుకడుగు వేయలేదు. తాను డిమాండ్ చేసినంత ఇచ్చేవారు. అయితే అది అప్పుడు. ఆ తరువాత కొత్త కొత్త హీరోయిన్లు రావడం... ఛాన్స్ లు తగ్గడం తాను కూడా బాలీవుడ్ వెళ్లిపోవడం జరిగిపోయింది. మళ్లీ చాలా గ్యాప్ తరువాత ఇలియానా తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. రవితేజ హీరోగా శ్రీను వైట్ల 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ముగ్గురు కథానాయికల అవసరం ఉండగా, ఒక కథానాయికగా ఇలియానాను ఎంపిక చేసుకున్నారట. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. ఎన్నో రోజుల నుండి ఇలియానా కూడా తెలుగులో రీఎంట్రీ ఇవ్వడానికి ట్రైం చేస్తుంది... ఇలాంటి టైంలో ఈ అవకాశం వచ్చింది. అలాంటిది రాక రాక అవకాశం వస్తే ఎవరైనా పారితోషికం ఎంత ఇచ్చినా పర్వాలేదు.. ఛాన్స్ వచ్చింది కదా అని అనుకుంటారు. కానీ ఇల్లీ బేబీ మాత్రం ఎక్కడా తగ్గకుండా... 2 కోట్ల పారితోషికం డిమాండ్ చేసేసిందట. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే.. ఆమెకు 2కోట్లు ఇవ్వడానికి నిర్మాతలు కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది. దీంతో ఇంత గ్యాప్ తరువాత కూడా ఇలియానా పారితోషికం విషయంలో ఎంతమాత్రం తగ్గకపోవడం.. దానికి నిర్మాతలు ఓకే చెప్పడం గ్రేట్ అని అందరూ ఆశ్చర్యపోతున్నారట. నిజంగానే చాలా గ్యాప్ తరువాత కూడా ఇలియానా ఇంత డిమాండ్ చేయడం గ్రేటే..