సెకండ్ మ్యారేజ్ చేసుకున్న మహేశ్ అక్క
on Dec 3, 2016
దీపావళి రోజున కారులోంచి దిగిన ఒక అందమైన అమ్మాయి పిల్లలతో కలిసి చిచ్చుబుడ్డి వెలిగించిన దృశ్యం ఇంకా తెలుగువారి మనసుల్లో మెదులుతూనే ఉంది. ఆ సినిమా ఏదో..? ఆ అమ్మాయి ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సినిమా తొలిప్రేమ..ఆ అమ్మాయి కీర్తిరెడ్డి. ఆ మూవీ తెచ్చిన గుర్తింపుతో తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలను అందుకుంది. ఆ తర్వాత సూపర్స్టార్ మహేశ్బాబు అక్కగా అర్జున్ మూవీలో మంచి నటన కనబరిచింది. అదే సమయంలో హీరో సుమంత్తో ప్రేమలో పడి, ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం చకచకా జరిగిపోయాయి.
కానీ, ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. కొన్ని రోజుల్లోనే వారి మధ్య అభిప్రాయ బేధాలు వచ్చి విడిపోయిన విషయం తెలుగువారందరికీ తెలుసు. దాని తర్వాత ఆమె ఎక్కడ కనిపించలేదు..ఎక్కడా వినిపించలేదు. మరి ప్రస్తుతం కీర్తి ఏంచేస్తున్నారు అని చాలా మంది మెదళ్లను తొలిచేసింది. దానికి ఇప్పుడు సమాధానం దొరికింది. ఇటీవలే తన కజిన్ హీరో సామ్రాట్ పెళ్లి వేడుకలో కీర్తిరెడ్డి దర్శనమిచ్చారు. సుమంత్తో విడిపోయాక కీర్తి అమెరికాలో సెటిల్ అయ్యారు. అక్కడే సెటిల్ అయిన ఓ డాక్టర్ని పెళ్లి చేసుకుని హ్యాపిగా మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది.