అల్లుఅరవింద్ స్కెచ్కు బలైన సూర్య, నాని
on Dec 2, 2016
అల్లు అరవింద్..మంచి అభిరుచి ఉన్న నిర్మాతగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన వ్యక్తి. సినిమాను ఎప్పుడు.. ఎలా రిలీజ్ చేయాలో తెలిసిని మేధావి. ఇప్పుడు ఆయనలోని వ్యూహ చతురత మరోసారి బయటపడింది. సూర్య-హరి క్రేజీ కాంభినేషన్లో వస్తున్న భారీ బడ్జెట్ మూవీ ఎస్-3ని అరవింద్ తన చాకచాక్యంతో వారం వెనక్కు జరిపించాడు. దీనిపై గత కొద్ది రోజుల నుంచి ప్రచారం జరుగుతున్నప్పటికీ క్లారిటీ లేదు.
కానీ ఉన్నట్లుండి సింగం-3 విడుదలను డిసెంబర్ 23కి వాయిదా వేస్తున్నట్లు ఆ సినిమా నిర్మాతలు ప్రకటించడం టాలీవుడ్, కోలీవుడ్లలో చర్చనీయాంశమైంది. డిసెంబర్ 9న గీతా ఆర్ట్స్ నిర్మాణంలో తెరకెక్కిన ధృవ రిలీజవుతోంది. ఆ తర్వాత వారం గ్యాప్లోనే సింగం-3 ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మరి వన్ వీక్ గ్యాప్ అంటే రామ్చరణ్కు ఇబ్బందే. ఎందుకంటే ధృవ క్లాస్ టచ్ ఉన్న సినిమా. సింగం-3 పక్కా మాస్ మసాలా.
దీనిని ఊహించిన అరవింద్ సైలెంట్గా పావులు కదిపారు. సింగం-3 నిర్మాత జ్ఞాన్వేల్ రాజాతో అరవింద్కు సన్నిహిత సంబంధాలున్నాయి..ఆయనను నయానో, బయానో ఒప్పించి సింగం-3ని 23కి వాయిదా వేయించారు. అయితే అదే రోజున నాని "నేను లోకల్" విడుదలవ్వాల్సి ఉంది. ఇక్కడ తెలివిగా వ్యవహరించిన అల్లు, దిల్రాజుతో కూడా తన సంబంధాలు వాడి దానిని వాయిదా వేయించి తను అనుకున్నది సాధించగలిగారు. మొత్తానికి అరవింద్ స్కెచ్తో సూర్య, నాని ఇరకాటంలో పడ్డారు.