రవితేజకు మారుతున్న నిర్మాతలు
on Feb 11, 2016
బెంగాల్ టైగర్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన రవితేజ వరస సినిమాలు కమిట్ అయి స్పీడ్ అవుదామనుకున్నాడు. కానీ మాస్ మహరాజ్ ప్రయత్నానికి దిల్ రాజు ప్రాజెక్ట్ ఫస్ట్ గండి కొట్టింది. ఆ సినిమా రెమ్యునరేషన్ దగ్గర తేడాలొచ్చి ఆగిపోయిందని వార్తలొచ్చాయి. దాన్ని పక్కకు తప్పించి ఆ తర్వాత కమిట్ అయిన యంగ్ డైరెక్టర్ చక్రితో సినిమాకు రెడీ అయ్యాడు. ఇప్పటికే ఈ సినిమాకు ' రాబిన్ హుడ్ ' అనే టైటిల్ ను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి ప్రొడ్యూసర్ కూడా తప్పుకున్నాడని సమాచారం. రాబిన్ హుడ్ ను శ్రీరంజిత్ మూవీస్ బ్యానర్ పై దామోదర ప్రసాద్ నిర్మించాలనుకున్నా, కొన్ని కారణాల వల్ల ఆయన సైడ్ అయిపోయాడట. దీంతో రాబిన్ హుడ్ నిర్మాణ బాధ్యతల్ని రవితేజతో ' నేనింతే ' తీసిన డివివి దానయ్య తీసుకున్నాడట. ప్రొడ్యూసర్ ఒకే కావడంతో మార్చిలో షూటింగ్ కు వెళ్లనున్నారు సినిమా టీం. త్వరలోనే డిటెయిల్స్ ను అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీగా ఉండే రవితేజకు ఈ నిర్మాతలతో కష్టాలు ఎందుకొస్తున్నాయో అంటూ గుసగుసలాడుతున్నాయి ఫిలింనగర్ వర్గాలు.