నయనతార గోవా వెళ్లిన అసలు కారణం ఇదే!
on Sep 14, 2020
నయనతార గోవా వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడికి వెళ్లినట్లు ఆమె ప్రియుడు విగ్నేష్ శివన్ సోషల్ మీడియాలో తెలిపాడు. దాంతో ప్రేమ పక్షులు సరదాగా సముద్ర తీరానికి వెళ్లారని అనుకున్నారంతా! కానీ, నయనతార గోవా ఎందుకు వెళ్ళిందో తెలుసా? ఆమె తల్లి పుట్టినరోజు సెలబ్రేట్ చేయడానికి! అవును... అదే నిజం! నయనతార తల్లి మిసెస్ కురియన్ పుట్టినరోజు నేడు. సెలబ్రేషన్స్ కోసం కేరళ నుండి గోవా వచ్చారు.
గోవాకి రొమాంటిక్ హాలిడే స్పాట్ అని పేరుంది. గోవా సముద్ర తీరాలలో ఎటు చూసినా ఎక్కువ శాతం మహిళలు బికినీలలో కనిపిస్తారు. ప్రేమపక్షులు, కొత్త జంటలు, పెళ్లి అయిన జోడీలు వగైరా వగైరా వగైరా మనుషులు గోవాలో కనిపిస్తారు. గోవాకి ఫ్యామిలీ ట్రిప్ వేసే జనాలు చాలా తక్కువ అని చెప్పుకోవాలి. తల్లి బర్త్ డే కోసం నయనతార గోవా ను ఎంపిక చేసుకోవడం విశేషం అని చెప్పాలి.
Also Read