నాగ్.. ఇప్పుడు మనోజ్ వంతు
on Apr 19, 2021
సీనియర్ స్టార్ అక్కినేని నాగార్జున ఒకవైపు కథానాయకుడిగా నటిస్తూనే.. మరోవైపు అతిథి పాత్రల్లో అలరిస్తుంటారు. మరీ ముఖ్యంగా.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో ఉన్న స్నేహం కారణంగా తన చిత్రంలోనూ, తన కుటుంబ సభ్యులు నటించిన సినిమాల్లోనూ స్పెషల్ రోల్స్ లో ఎంటర్ టైన్ చేశారు. 20 ఏళ్ళ క్రితం మోహన్ బాబు కథానాయకుడిగా నటించిన `అధిపతి`(2001)లో కాసేపు అతిథిగా మెరిశారు నాగ్. అలాగే.. మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు హీరోగా నటించిన `కృష్ణార్జున` (2008)లో కీలక పాత్రలో కనిపించారు. అదేవిధంగా.. మోహన్ బాబు తనయ మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన `దొంగాట` (2015)లో ఓ పాటలో తళుక్కుమన్నారు.
కట్ చేస్తే.. ఇప్పుడు అదే కుటుంబానికి చెందిన మంచు మనోజ్ తోనూ కాసేపు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారట నాగ్. ఆ వివరాల్లోకి వెళితే.. మనోజ్ కథానాయకుడిగా `అహం బ్రహ్మస్మి` పేరుతో ఓ పాన్ - ఇండియా మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పతాక సన్నివేశాల్లో నిమిషం పాటు సాగే గెస్ట్ రోల్ లో దర్శనమివ్వనున్నారట కింగ్ నాగ్. మరి.. ఈ కథనాల్లో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.