15 ఏళ్ల తరువాత అక్కడ నాగార్జున?
on Jul 17, 2018
అక్కినేని నాగార్జునకి టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా మంచి పేరు ఉంది. హిందీ లో ఆయన పలు సినిమాలలో నటించారు.దాదాపు 15 ఏళ్ల తరువాత మళ్ళీ ఒక హిందీ చిత్రంలో నటించనున్నారు.‘బ్రహ్మాస్త్రా’ అనే చిత్రంలో నాగ్,అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషించనున్నారు.నాగ్ కి ,బచ్చన్ కి మంచి స్నేహం ఉందని అందరికి తెలిసిందే. ఈ చిత్రం రణ్బీర్ కపూర్, ఆలియా భట్ ప్రధాన తారాగణంగా తెరకెక్కనుంది. అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇందులో నాగార్జున కి జోడిగా నటి డింపుల్ కపాడియా నటించనున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం.ఒకవేళ డింపుల్ నటిస్తున్న మాట నిజమే అయితే దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఆమె నటించే సినిమా ఇదే అవుతుంది. బల్గేరియాలో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. రెండో షెడ్యూల్లో నాగార్జున నటించనున్నారు.ఇందులో నాగ్ది ప్రత్యేకమైన పాత్ర అని, ఆయనతో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నామని ఈ చిత్ర నిర్మాత కరణ్ జోహార్ ట్విటర్ ద్వారా వెల్లడించారు.