శ్రీనువైట్ల... తిన్నదంతా కక్కు..!
on Apr 24, 2017
ఫామ్ లో ఉన్నంత వరకే ఎవరికైనా గౌరవం. ఒక్కసారి ఫామ్ కోల్పోయి ఫ్లాపుల మీద ఫ్లాపులు పడితే... అసలు రంగు బయటపడుతుంది. శ్రీనువైట్ల విషయంలో ఇదే జరుగుతోంది. ఆయన ఫామ్లో ఉండి, హిట్ల మీద హిట్లు ఇచ్చినప్పుడు నిర్మాతలంతా ఆయన వెంట తిరిగారు. ఫామ్ కోల్పోయి ఫ్లాపులు అందుకొన్నాక... ఆయనే ఇప్పుడు నిర్మాతల వెంట పడుతున్నాడు. దాంతో శ్రీనువైట్ల అంటే అందరికీ చిన్నచూపు ఏర్పడింది. తాజాగా విడుదలైన మిస్టర్తో శ్రీను కెరీర్లో మరో డిజాస్టర్ నమోదైంది. ఈ సినిమాతో నిర్మాతలు నిలువునా మునిగిపోయారు.
దాంతో... నష్టాలు భర్తీ చేయాలంటూ శ్రీనువైట్లపై ఒత్తిడి పెరుగుతోందని సమాచారం. ఈ సినిమా కోసం దాదాపుగా రూ.30 కోట్లు ఖర్చు పెట్టించాడట శ్రీను. అదంతా బూడిదలో పోసిన పన్నీరైంది. నష్టాల్లో నువ్వూ వాటాకి రా.. అంటూ నిర్మాతలు శ్రీనువైట్లని అడుగుతున్నార్ట. `నష్టాలొస్తే నేను చూసుకొంటా` అని శ్రీనువైట్ల నిర్మాతలకు ముందే భరోసా ఇచ్చాడట. శ్రీనువైట్లపై నమ్మకంతోనే నిర్మాతలు అడిగినంత పెట్టుబడి పెట్టారని, అందుకే ఇప్పుడు నిలదీస్తున్నారని సమాచారం. రూ.30 కోట్లలో దర్శకుడు ఎంత భర్తీ చేస్తాడో చూడాలి.