ట్రెండీ బిజినెస్లోకి మంచు ఫ్యామిలీ కూడా...
on Aug 13, 2020
ఓటీటీ... ఇదీ లేటెస్ట్ ట్రెండ్! లాక్డౌన్లో ఆడియన్స్ ఓటీటీకి ఎట్రాక్ట్ అయిన మాట వాస్తవమే. థియేటర్లు ఓపెన్ చేసిన ఓటీటీ వేదికలకు ఇంత అట్రాక్షన్ ఉంటుందా? లేదా? అన్నది చెప్పలేం. కానీ, మార్చి ముందు ఎంత ఉందో అంతకంటే ఎక్కువ ఉంటుందని మాత్రం చెప్పగలం. అందుకని, టాలీవుడ్ ప్రముఖులు ఓటీటీ వ్యాపారంలోకి దిగడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు.
మంచు ఫ్యామిలీ సైతం ఒక ఓటీటీ వేదిక ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నదని సమాచారం. మోహన్ బాబు పెద్ద కుమారుడు విష్ణు మంచు ఓటీటీకి సంబంధించిన పనులు మొదలుపెట్టారట. ఆల్రెడీ మెగా ఫ్యామిలీ నుండి అల్లు అరవింద్ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చారు. 'ఆహా'లో ఆయన భాగస్వామి అన్నది తెలిసిందే. సురేష్ బాబుకు స్టూడియోలు, పోస్ట్ ప్రొడక్షన్-వీఎఫ్ఎక్స్ పనులు చేసే కంపెనీలు ఉన్నాయి. ఓ సెలబ్రిటీ మెనేజ్మెంట్ కంపెనీలో రానాకి వాటాలు ఉన్నాయి. దగ్గుబాటి ఫ్యామిలీ సైతం ఓ ఓటీటీ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. రామ్ జైపాల్ వర్మ ఏటీటీ అని స్టార్ట్ చేశారు. ఇంకా ఇందులోకి ఎంతమంది ప్రముఖులు దిగుతారో చూడాలి.
Also Read