మలయాళం తార మృదుల పెళ్లయింది!
on Oct 30, 2020
2019లో ఎంగేజ్మెంట్ చేసుకున్న మలయాళం తార మృదులా మురళి ఎట్టకేలకు పెళ్లాడింది. తన సుదీర్ఘ కాల బాయ్ఫ్రెండ్ నితిన్ విజయ్తో ఆమె వివాహం అక్టోబర్ 29న కేరళలోని కొచ్చిలో జరిగింది. ఈ వివాహానికి ఫిల్మ్ ఇండస్ట్రీలోని మృదుల సన్నిహిత స్నేహితులు కొంతమంది హాజరయ్యారు. మృదుల క్లోజ్ ఫ్రెండ్, సింగర్ అయిన సయనోరా ఫిలిప్ వధూవరుల పెళ్లి ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసింది. ఆ ఇద్దరు ఒకరికి ఒకరు అన్నంత చక్కగా ఉన్నారని రాసుకొచ్చింది. పెళ్లికి హాజరైన సెలబ్రిటీల్లో రమ్య నంబీశన్, విజయ్ యేసుదాస్, రాహుల్ సుబ్రమణియన్, విష్ణు వర్మ లాంటి వాళ్లున్నారు.
సయనోరా షేర్ చేసిన పెళ్లి ఫొటోల్లో మృదుల, నితిన్ తమ మధ్య ఉన్న ప్రేమాను బంధానికి తగ్గట్లుగా ఆనందంగా నవ్వులు చిందిస్తూ, ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ కనిపిస్తున్నారు. ఇద్దరూ బంగారు వర్ణం సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్నారు.
'డయల్ అండ్ సీ' అనే టీవీ ప్రోగ్రామ్ ద్వారా చైల్డ్ యాంకర్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మృదుల, తర్వాత కాలం మలయాళంతో పాటు తమిళ చిత్రాల్లోనూ నటిస్తూ వస్తోంది. ఆమె తొలి చిత్రం 'రెడ్ చిల్లీస్' అనే మలయాళం మూవీ. తమిళంలో తొలి సినిమా 'నాగరాజ చోళన్ ఎంఏ, ఎంఎల్ఏ'లో చేసిన పాత్రతో అందరి ప్రశంసలూ అందుకుంది.
Also Read