జనవరిలో అమెరికా వెళ్తున్న మహేశ్-కీర్తి జోడీ!
on Oct 31, 2020
మహేశ్ హీరోగా పరశురామ్ డైరెక్ట్ చేయనున్న 'సర్కారు వారి పాట' సినిమా షూటింగ్ 2021 జనవరి ఫస్ట్ వీక్ నుంచి జరగనున్నది. అత్యధిక అంచనాలు ఉన్న ఈ సినిమా షూటింగ్ నిజానికి ఈ ఏడాది వేసవిలోనే ప్రారంభం కావాల్సి ఉంది. అయితే కరోనా మహమ్మారి దెబ్బకు రెగ్యులర్ షూటింగ్ అనివార్యంగా వాయిదా పడింది. ఇప్పుడు నిర్మాతలు జనవరి నుంచి షూటింగ్ జరిపేందుకు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు.
సినిమా కథలో చాలా భాగం అమెరికా నేపథ్యంలో నడుస్తుంది కాబట్టి ఎక్కువ శాతం షూటింగ్ అక్కడ జరపనున్నారు. యూనిట్కు సంబంధించిన వీసాల అనుమతుల కోసం నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. అవి రాగానే యు.ఎస్.కు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ షెడ్యూల్లోనే మహేశ్, హీరోయిన్ కీర్తి సురేశ్ మధ్య సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో మహేశ్ రెండు ఛాయలున్న పాత్రలో కనిపిస్తాడని సమాచారం. పాన్ బ్రోకర్గా ఒక రోల్ అయితే, బ్యాంక్ ఆఫీసర్గా ఇంకో రోల్ అని వినిపిస్తోంది. ఇతర భాషల్లోనూ ఏక కాలంలో విడుదల చేయాలనుకుంటున్న సినిమా కాబట్టి, బాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీలోని ఇతర భాషలకు చెందిన ప్రముఖ నటులను ఈ సినిమా కోసం తీసుకుంటున్నారు. నటులకు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే రానున్నది.
కృష్ణ బర్త్డే సందర్భంగా మే 31న 'సర్కారు వారి పాట' టైటిల్ను, ప్రీ లుక్ పోస్టర్నూ రిలీజ్ చేసి ఫ్యాన్స్కు ఆనందాన్ని పంచాడు మహేశ్. సోషల్ మీడియాలో టైటిల్ మోషన్ పోస్టర్కూ, ప్రీ లుక్కూ అనూహ్యమైన రెస్పాన్స్ లభించింది. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకు పి.ఎస్. వినోద్ (అల.. వైకుంఠపురములో) సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు.
Also Read