డైరెక్టర్ కావాలనుకున్న సౌందర్య?
on Mar 1, 2021
వెండితెరను కొన్నేళ్ల పాటు మురిపించిన అందాల రాశి సౌందర్య. కన్నడ నటి అయినా తెలుగు, తమిళ భాషల్లో నటిగా చెరగని ముద్ర వేశారు. మహానటి సావిత్రి తరువాత నటిగా అంతటి మంచి గుర్తింపుని, పేరుని సొంతం చేసుకున్నారు. టాలీవుడ్, కోలీవుడ్తో పాటు కన్నడ చిత్రాల్లోనూ స్టార్ హీరోలతో కలిసి నటించి స్టార్ హీరోయిన్గా ఈ మూడు భాషల్లో ఓ వెలుగు వెలిగారు.
ఆమె క్రేజ్ని చూసిన చాలా మంది హీరోలు అమెని వివాహం చేసుకోవాలనుకున్నారు. ఓ హీరో ఆమె కోసం బెంగళూరు వెళ్లేవారని కూడా టాలీవుడ్లో ప్రముఖంగా ప్రచారం జరిగింది. నటిగా ఇంతటి క్రేజ్ని దక్కించుకున్న సౌందర్య నటిగా ఫుల్ బిజీగా వున్న సమయంలోనే బీజేపీ పార్టీ తరుపున ప్రచారం కోసం వెళ్లి 2004 ఏప్రిల్ 17న హెలీకాప్టర్ ప్రమాదానికి గురై తిరిగిరాని లోకాలకి వెళ్లిపోయారు. తన అభిమానుల్ని, తనని ఆరాధించే వారిని శోక సంద్రంలో ముచేశారు.
అయితే ఆమెకు తీరని కోరిక ఒకటి వుందని, అది తీరకుండానే ఆమె అనంతలోకాలకి వెళ్లిందని హీరో జేడీ చక్రవర్తి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. సౌందర్యకు డైరెక్షన్ చేయాలనే కోరిక వుండేదని, అందుకోసం ఓ అద్భుతమైన కథని కూడా సిద్ధం చేసిందని ఆయన అన్నారు. ఆ కథని తనకు చెప్పిందని, అయితే ఆ కల తీరకుండానే వెళ్లిపోయిందని జేడీ చక్రవర్తి వెల్లడించారు.
Also Read