వైష్ణవ్ తేజ్, రకుల్ప్రీత్ జంటగా క్రిష్ కొత్త సినిమా
on Aug 14, 2020
'ఉప్పెన' ఫేమ్ పంజా వైష్ణవ్ తేజ్, రకుల్ప్రీత్ సింగ్ జంటగా క్రిష్ డైరెక్ట్ చేసే నూతన చిత్రం పూజా కార్యక్రమాలు శుక్రవారం ఉదయం నిర్మాణ సంస్థ కార్యాలయంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో చిత్రం బృందమంతా పాల్గొన్నారు. ఇది ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో జరిగే కథ. శనివారం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. సింగిల్ షెడ్యూల్లో సినిమాని పూర్తి చేయడానికి డైరెక్టర్ క్రిష్ సన్నాహాలు చేస్తున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై జాగర్లమూడి సాయిబాబు, వై. రాజీవ్రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జ్ఞానశేఖర్ వి.ఎస్. సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నారు.
కాగా పవర్స్టార్ పవన్ కల్యాణ్, క్రిష్ కాంబినేషన్లో ఇప్పటికే ఓ సినిమా నిర్మాణంలో ఉన్న విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' మూవీ షూటింగ్ పూర్తి చేసి, క్రిష్ డైరెక్ట్ చేసే సినిమా సెట్స్పైకి వస్తారు. ఈలోగా వైష్ణవ్ తేజ్ సినిమాని క్రిష్ పూర్తి చేయనున్నారు. మరోవైపు వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ 'ఉప్పెన' రిలీజ్కు రెడీగా ఉంది.