ముద్దుగుమ్మ బర్త్డే గిఫ్ట్ మిస్సయ్యింది!
on Jun 30, 2020
హిందీనాట బిజీగా ఉన్న యువ కథానాయికల్లో కియారా అద్వానీ ఒకరు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ‘లక్ష్మీ బాంబ్’, ‘ఇందూ కీ జవాని’, ‘షేర్షా’, ‘భూల్ భులయ్యా 2’ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటిలో తొలి మూడు చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్లో ఉండగా.. ‘భూల్ భులయ్యా 2’ చిత్రీకరణ దశలో ఉంది. వాస్తవానికి ఈ పాటికే ఈ సినిమా కూడా చిత్రీకరణ పూర్తి చేసుకోవాల్సి ఉంది. అయితే, కరోనా ఎఫెక్ట్తో ప్రణాళిక మారింది. దాంతో జూలై 31న రావాల్సిన ఈ సీక్వెల్ కాస్తా ఏడాది చివరకు వెళ్లిపోయింది.
ప్రస్తావించదగ్గ విషయం ఏమిటంటే.. జూలై 31 కియారా అద్వానీ పుట్టినరోజు. సో.. అన్నీ కుదిరి ఉంటే కియారా బర్త్డే గిఫ్ట్గా ‘భూల్ భులయ్యా 2’ థియేటర్లలో సందడి చేసి ఉండేది. అయితే కరోనా కారణంగా కియారా తన పుట్టినరోజు కానుకని మిస్ చేసుకున్నట్లయింది. కాగా, సెప్టెంబర్ నుంచి ఈ సినిమా తాలూకు చిత్రీకరణ పునఃప్రారంభం కానుంది. కార్తిక్ ఆర్యన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో టబు ఓ కీలక పాత్రలో కనిపించనుంది. అనీస్ బాజ్మీ డైరెక్ట్ చేస్తున్న ఈ కామెడీ హారర్ని భూషణ్ కుమార్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
కాగా, హిందీ చిత్రం ‘ఫగ్లీ’ (2014)తో కథానాయికగా పరిచయమైన కియారా.. ‘యం.యస్.ధోని: ది అన్టోల్డ్ స్టోరీ’ (2016)తో తొలి ఘనవిజయాన్ని అందుకుంది. ఆపై ‘భరత్ అనే నేను’ (2018), ‘వినయ విధేయ రామ’ (2019) చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ‘అర్జున్ రెడ్డి’కి రీమేక్గా రూపొందిన ‘కబీర్ సింగ్’(2019)తో హిందీనాట స్టార్ హీరోయిన్గా ఎదిగింది కియారా.
మరి.. రాబోయే చిత్రాలతో కియారా స్థాయి మరింత పెరుగుతుందేమో చూడాలి.