హీరోను కరణ్ జోహార్ పెంపుడు జంతువు అంటూ హేళన చేసిన కంగన!
on Dec 3, 2020
వివాదాస్పద తార కంగనా రనౌత్కు, నటుడు-గాయకుడు దిల్జీత్ దోసాంజ్కు మధ్య ట్వీట్ల యుద్ధం నడుస్తోంది. అతడిని కరణ్ జోహర్ పెంపుడు జంతువు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కంగన. విషయం ఏమిటంటే.. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు ఉద్యమం చేస్తోన్న సంగతి తెలిసిందే. రైతుల ఆందోళనలో పాల్గొన్న ఓ సిక్కు మహిళను ఉద్దేశించి.. పొరపాటున షాహీన్ బాగ్ దాదీలలో ఒకరైన బిల్కిస్ బానుగా భావించి.. ట్విట్టర్ వేదికగా కంగన విమర్శలు చేశారు.
ఆమె తప్పుపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. వెనకా ముందు చూసుకోకుండా.. ట్వీట్ చేస్తే ఇలానే అవుతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా 'గుడ్ న్యూస్'లో కియారా అద్వానా జోడీగా నటించిన దిల్జీత్ దోసాంజ్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా స్పందించారు. "కంగన.. బిల్కిస్ బానుగా భ్రమించి ట్వీట్ చేసిన ఈమె పేరు మహిందర్ కౌర్. కంగన టీమ్ ఈ నిజం వినండి. ఎవరూ ఇంత గుడ్డివాళ్లలా ఉండకూడదు. ఆమె ఇలాంటివి ఏమైనా చెప్తూనే ఉంటారు" అని రాసుకొచ్చారు. అంతే కాదు, మహీందర్ కౌర్ మాట్లాడిన వీడియో ఫుటేజ్ను కూడా షేర్ చేశాడు దిల్జీత్.
దీనిపై కంగన మండిపడ్డారు. కరణ్ పెంపుడు జంతువు అంటూ దోసాంజ్పై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దిల్జిత్ ట్వీట్పై స్పందించిన కంగన.. "ఓ కరణ్ జోహర్ పెంపుడు జంతువు.. షాహీన్ బాగ్లో తన పౌరసత్వం కోసం నిరసన చేసిన దాదీ.. ఇప్పుడు రైతులు కనీస మద్దతు ధర కోసం చేస్తోన్న ఆందోళనలో కేవలం వంద రూపాయల కోసం వచ్చి కూర్చున్నది. మహీందర్ కౌర్ జీ ఎవరో నాకు తెలియదు. మీరంతా ఏం డ్రామాలు ఆడుతున్నారు.. వెంటనే ఆపేయండి" అంటూ విరుచుకుపడ్డారు. అదీ విషయం.
Also Read