ఎన్టీఆర్ని మోసం చేసిన కొరటాల
on Aug 31, 2016
ఏ హీరోతో పనిచేస్తే ఆ హీరో గొడుగు పట్టడం హీరోయిన్లకే కాదు, దర్శకులకూ అలవాటే. `ఈ కథ రాసిందే ఈ హీరో కోసం తెలుసా` అన్నట్టు మాట్లాడుతుంటారు. ఈ పాత్రకు ఈ హీరో తప్ప ఎవ్వరూ యాప్ట్ కారు.. అంటూ కెమెరాల ముందు యాక్ట్ చేస్తారు. ఇప్పుడు కొరటాల శివ కూడా అదే చెబుతున్నాడు. జనతా గ్యారేజ్ కథ కేవలం ఎన్టీఆర్ కోసమే పుట్టిందని ఈ సినిమా మొదలైనప్పటి నుంచీ ఇప్పటి వరకూ చెబుతూనే వచ్చాడు. ఎన్టీఆర్ ని దృష్టిలో ఉంచుకొనే జనతా గ్యారేజ్ కథ తయారు చేశానని అంటున్నాడాయన.కానీ వాస్తవం మాత్రం అది కాదు. మిర్చి టైమ్ కంటే ముందే.. ఈ కథ రెడీ చేశాడు కొరటాల. ప్రభాస్కి ముందు చెప్పింది ఈకథే అని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రభాస్ నో.. అంటే.. అప్పుడు మిర్చి కథ పుట్టింది. శ్రీమంతుడు కంటే ముందు మహేష్ బాబుకి వినిపించింది కూడా ఇదే కథట. కానీ మహేష్ కూడా కాదన్నాడని సమాచారం. ఆఖరికి చరణ్ కోసం కథ వినిపించినప్పుడూ ఈ కథే చెప్పాడట. చరణ్ కూడా నో అన్నాడని టాక్. అలా ముగ్గురు హీరోలు వదిలేసిన కథ ఇప్పుడు ఎన్టీఆర్కి అంటగట్టాడన్నమాట. అదేం తప్పుకాకపోయినా.. `ఈకథ మీ కోసమే పుట్టింది` అని ఇప్పటికీ చెబుతుంటే మాత్రం నవ్వొస్తోంది. తన కథని అమ్ముకోవాలంటే.. ఓ స్టార్ హీరోతో సినిమా పట్టాలెక్కించాలంటే ఇలాంటి మతలబులు తప్పవేమో?