అమ్మమృతిపై ఆ హీరోయిన్కు అనుమానాలు
on Dec 9, 2016
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతిపై దేశవ్యాప్తంగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆసుపత్రిలో చేరిన తర్వాత అనేక సంఘటనలు జరిగాయి..కానీ ఎవ్వరూ నోరు మెదపడం లేదు..జయ అంటే ఎంతో అభిమానం ఉన్నవారు కూడా చాలా మంది మనకెందుకొచ్చిన గొడవ అని మౌనంగా ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్ నటి గౌతమి అమ్మ మృతిపై స్పందించారు.
అంతేకాదు దీనిపై నిజానిజాలు బయటపెట్టాల్సిందిగా ఏకంగా ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు. జయ ఆస్పత్రి పాలు కావడం, అక్కడ పూర్తిగా కోలుకున్నట్లు చెప్పడం, అంతలోనే ఉన్నట్లుండి మరణించారనడం వెనుక కుట్ర దాగుందని..ఈ విషయాలను కప్పిపెట్టి ఉంచారని, సీఎం ఆస్పత్రిలో ఉన్నపుడు ఎంతమంది వీఐపీ, వీవీఐపీ వచ్చినా కూడా ఆమె ముఖాన్ని చూపించలేదని అన్నారు. ఆమె ఆరోగ్యం విషయంలో ఇంత రహస్యం ఎందుకు పాటించాల్సి వచ్చిందని గౌతమి ప్రశ్నించారు.