ఎన్టీఆర్ ఫ్యాన్స్ని భయపెడుతున్న లోగో...!
on Aug 27, 2016
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంభినేషన్లో తెరకెక్కి త్వరలో రిలీజ్కు రెడీ అవుతున్న జనతా గ్యారేజ్పై అభిమానుల్లో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆడియో అదిరిపోవడంతో పాటు..థియేటర్ ట్రైలర్ ఓ రేంజ్లో ఉండటంతో సినిమా ఖచ్చితంగా హిట్టయ్యి..ఎన్టీఆర్కు పునర్వైభవం ఖాయమని అభిమానులు ఫిక్పైపోయారు. అలాంటి టైంలో ఒక వార్త జూనియర్ అభిమానులను కలవరపాటుకు గురిచేస్తోంది. నిన్న సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న 'జనతా గ్యారేజ్' యూనిట్ లేటెస్ట్గా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్లలో అంతర్జాతీయ ఫిల్మ్ డిస్ట్రీబ్యూషన్ సంస్థ ఈరోస్ సంస్థ లోగో కనిపించడం అభిమానులను భయపెడుతోంది. ఎందుకంటే ఇటీవలి కాలంలో ఈరోస్ సంస్థ వరల్డ్ వైడ్గా రిలీజ్ చేసిన ఏ సినిమా కూడా హిట్టయ్యిన దాఖలాలు లేవు. అసలే ఎంతో కష్టపడి సినిమా కావడం, ప్రెస్టిజ్ ఇష్యూ కావడంతో జనతా గ్యారేజ్ ఖచ్చితంగా హిట్టై తీరాలని ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈరోస్ సెంటిమెంట్ వారిని వేధిస్తోంది. ఏం జరుగుతుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అవ్వాల్సిందే..