8.. 18.. 11.. సుశాంత్ లవర్ ఫ్యామిలీ ఇంటరాగేషన్ టైమ్!
on Aug 11, 2020
బాలీవుడ్ తార, జూన్లో సూసైడ్ చేసుకున్నాడని భావిస్తున్న సుశాంత్సింగ్ లవర్ రియా చక్రవర్తి ఇప్పుడు మీడియా, పబ్లిక్ దృష్టిలో కేంద్రంగా మారింది. సుశాంత్ మృతి కేసులో ఆమె ప్రమేయం ఉందనే ఆరోపణలు, వాదనలు బలంగా వినిపిస్తున్నప్పటికీ, దానికి సంబంధించిన బలమైన రుజువులు ఇంతదాకా కనిపించలేదు. అనేక ట్విస్టుల తర్వాత ఈ కేసు దర్యాప్తు బాధ్యత సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేతుల్లోకి వెళ్లింది. ఈ కేసులో మనీ లాండరింగ్ కోణం నుంచి ఈడీ దర్యాప్తు చేస్తోంది.
ఆగస్ట్ 7న మొదటిసారి ఈడీ ఆఫీస్కు ఇంటరాగేషన్ నిమిత్తం వెళ్లింది రియా చక్రవర్తి. ఆమెను 8 గంటల పైగా విచారించారు అధికారులు. ఆ తర్వాత ఆగస్ట్ 8న ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని తొలిసారి 18 గంటలపాటు ఇంటరాగేట్ చేశారు ఈడీ అధికారులు. ఇప్పుడు, లేటెస్ట్ రిపోర్టుల ప్రకారం రియా తండ్రి ఇంద్రజిత్ను 11 గంటల సేపు ఈడీ విచారించింది. ఆయనతో పాటు రియా, షోవిక్లు కూడా అక్కడే ఉన్నారు. ఈ విషయాన్ని పాపులర్ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించింది. ఈడీ ఆఫీస్లోకి వెళ్లిన 11 గంటల తర్వాత రియా, ఆమె తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి, సోదరుడు షోవిక్ బయటకు వచ్చారని ఆ సంస్థ తెలిపింది.
సుశాంత్ సింగ్ ఫ్యామిలీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ మేరకు మనీ లాండరింగ్ కోణంలో ఈ కేసును ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇంద్రజిత్ను తొలిసారి ఇంటరాగేట్ చేసిన అధికారులు రియా, షోవిక్లను రెండోసారి ఇంటరాగేట్ చేశారు. అలాగే సుశాంత్తో పాటు ఫ్లాట్లో నివాసం ఉంటున్న అతని ఫ్రెండ్ సిద్ధార్థ్ పితానీని కూడా ఈడీ అధికారులు విచారించారని సమాచారం.
Also Read