డ్రగ్ కేస్.. మూడు రోజులుగా మాయమైపోయిన దీపికా పడుకోనే మేనేజర్!
on Oct 30, 2020
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ సమన్లు జారీ చేసిన తర్వాత మూడు రోజులుగా కనిపించకుండా పోయింది దీపికా పడుకోనే టాలెంట్ మేనేజర్ కరిష్మా ప్రకాశ్. మంగళవారం ముంబైలోని వర్సోవాలో ఉన్న కరిష్మా నివాసంలో సోదాలు నిర్వహించిన ఎన్సీబీ అధికారులు, అక్కడ 1.7 గ్రాముల హాషిష్, మూడు డబ్బాల సీబీడీ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు.
బాలీవుడ్ డ్రగ్ కేసు దర్యాప్తులో భాగంగా అరెస్ట్ చేసిన ఒక డ్రగ్ పెడ్లర్ను ఇంటరాగేట్ చేసినప్పుడు కరిష్మా ప్రకాశ్ పేరు బయటకు వచ్చిందని ఎన్సీబీ అధికారులు తెలిపారు. నటి రియా చక్రవర్తి అరెస్ట్ అయ్యింది ఈ కేసులోనే. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసుతో ఈ డ్రగ్ కేసుకు సంబంధం ఉంది. కరిష్మా నివాసం తలుపుకు ఎన్సీబీ సమన్ల నోటీసును అంటించింది. కానీ అప్పట్నుంచీ ఆమె నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా పోయింది.
డ్రగ్ పెడ్లర్తో సంబంధాలు, ఆమె నివాసం నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడం, ఎన్సీబీకి సహకరిచకపోవడం, సమన్లు జారీ చేసినా పట్టించుకోకపోవడం వంటివి కరిష్మాను మరింత సమస్యల్లోకి నెట్టనున్నాయి. ఆమెపై ఎన్సీబీ కఠిన చర్యలు తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరిష్మా, దీపికా పడుకోనే మధ్య అనుమానాస్పద సంభాషణను కనిపెట్టిన ఎన్సీబీ, గత ఏడాది ఆ ఇద్దరినీ ఆ విషయమై ప్రశ్నించింది.
Also Read