డాక్టర్ రాజశేఖర్కు ప్లాస్మా థెరపీ!
on Oct 27, 2020
తీవ్రమైన కొవిడ్-19 లక్షణాలతో హైదరాబాద్లోని సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న డాక్టర్ రాజశేఖర్ ఆరోగ్యం క్రమేణా మెరుగవుతున్నట్లు హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. శ్వాసపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చిన ఆయనకు ఇప్పటివరకు నాన్-ఇన్వేజివ్ వెంటిలేటర్ సపోర్ట్తో కృత్రిమ శ్వాస అందిస్తూ వచ్చిన వైద్యులు.. తాజాగా ఆ సపోర్ట్ను తొలగించారు. ఈ విషయాన్ని మంగళవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ రత్నకిశోర్ తెలియజేశారు.
"ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఇప్పటివరకూ అందించిన నాన్-ఇన్వేజివ్ వెంటిలేటర్ సపోర్ట్ను తాజాగా తొలగించాం. చికిత్సలో భాగంగా ఆయనకు ప్లాస్మా థెరపీ, సైటోసోర్బ్ డివైస్ థెరపీ అందించాం." అని ఆ బులెటిన్లో వెల్లడించారు. డాక్టర్ రాజశేఖర్ ఆరోగ్య స్థితి మెరుగయ్యిందనీ, చికిత్సకు ఆయన బాగా స్పందిస్తున్నారనీ అందులో తెలిపారు. దీంతో రాజశేఖర్ ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేస్తూ వస్తోన్న అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.