సుశాంత్ మాజీ మేనేజర్ 100కి డయల్ చేయలేదు!
on Sep 18, 2020
సుశాంత్ సింగ్ రాజ్పుత్ జూన్ 14న సూసైడ్ చేసుకున్నాడు. అంతకు ముందు ఆరు రోజుల క్రితం జూన్ 8న అతడి మాజీ మేనేజర్ దిశా సాలియాన్ సూసైడ్కి పాల్పడిన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి సూసైడ్లకు లింక్ ఉందని పలువురు అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అందులో నిజమెంత? అని సీబీఐ దర్యాప్తు చేయడానికి సిద్ధమైందట. అయితే, ఇటీవల నేషనల్ మీడియాలో కొన్ని వర్గాలు జూన్ 8న 100కి డయల్ చేయడానికి ప్రయత్నించిందని రిపోర్టు చేశాయి. వాటిని ముంబయ్ పోలీసులు ఖండించారు.
‘‘స్నేహితురాలు అంకితకు దిశా సాలియాన్ చివరిసారిగా ఫోన్ చేసింది. ఆమె లాస్ట్ కాల్ అదే. 100కి డయల్ చేయడానికి ప్రయత్నించిందని వచ్చిన వార్తలు అవాస్తవం’’ అని ముంబయ్ పోలీసులు పేర్కొన్నారు. తమ కుమార్తె మరణం విషయంలో ఎటువంటి అనుమానాలు లేవని దిశా సాలియాన్ తల్లితండ్రులు చెబుతున్నప్పటికీ... సీబీఐ మాత్రం విచారణ చేయాలనుకుంటుందట. దిశా ఫియాన్సీ రోహన్ రాయ్కి సీబీఐ సమన్లు జారీ చేసిందని రిపబ్లిక్ టీవీ కథనం.
Also Read