'ఆర్య' నుంచీ సుకుమార్ది అదే బాట!
on Jun 2, 2020
బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ సినిమాలంటేనే వైవిధ్యానికి కేరాఫ్ అడ్రస్. ఫస్ట్ ఫిలిమ్ ‘ఆర్య’ నుంచి ప్రీవియస్ మూవీ ‘రంగస్థలం’ వరకు ఒక్కో సినిమాను ఒక్కో తరహాలో తెరకెక్కించాడు ఈ మాజీ లెక్కల మాస్టర్. ఇప్పుడు ఇదే తరహాలో తన తాజా చిత్రం ‘పుష్ప’ని కూడా రూపొందించే ప్రయత్నం చేస్తున్నాడు. ‘ఆర్య’, ‘ఆర్య2’ తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో సుక్కు చేస్తున్న సినిమా కావడంతో సహజంగానే ‘పుష్ప’పై మంచి అంచనాలున్నాయి.
ఇదిలా ఉంటే.. ‘ఆర్య’ నుంచి సుకుమార్ సినిమాలను పరిశీలిస్తే ఓ విషయం స్పష్టం. అదేమిటంటే.. తన సినిమాలన్నీ ‘ఏక కథానాయిక’ కథలే కావడం. ‘ఆర్య’లో అను మెహతా నాయికగా నటిస్తే, ‘జగడం’లో ఇషా సోలో హీరోయిన్గా మెరిసింది. ఇక ‘ఆర్య2’లో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తే.. ‘100% లవ్’లో తమన్నా నాయికగా దర్శనమిచ్చింది. అలాగే.. ‘1.. నేనొక్కడినే’లో కృతి సనన్ హీరోయిన్ కాగా, ‘నాన్నకు ప్రేమతో’ రకుల్ ప్రీత్ సింగ్ది సోలో నాయిక వేషమే. ఇక సుకుమార్ సెవెన్త్ వండర్ ‘రంగస్థలం’ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇందులో సోలో హీరోయిన్గా మాస్ని కట్టిపడేసింది సమంత. ఈ ఏడు చిత్రాల్లోనూ ప్రత్యేక గీతాల పేరిట, సహాయక పాత్రల సెక్షన్లో గ్లామర్ ఉన్నా.. సుక్కు మంత్రం మాత్రం ‘ఏక కథానాయిక’ కథలకే పెద్ద పీట వేయడం.
కట్ చేస్తే.. ఇప్పుడు తన ఎనిమిదో చిత్రం ‘పుష్ప’లోనూ అదే ఫార్మాట్ని కొనసాగిస్తున్నాడు సుకుమార్. ఈ సినిమాలో రశ్మికా మందన్న సింగిల్ హీరోయిన్గా సందడి చేయనుంది. మున్ముందు కూడా సుకుమార్ ఇదే బాణీని కంటిన్యూ చేస్తాడేమో చూడాలి మరి.
Also Read