దిల్ రాజుకు కోపం వచ్చింది
on Aug 7, 2017
సుప్రీమ్, శతమానం భవతి, నేను లోకల్, దువ్వాడ జగన్నాథం, ఫిదా.. ఇలా వరుస విజయాలతో నిర్మాతగా దూసుకుపోతున్న దిల్ రాజు అసహనానికి లోనయ్యాడు. ఇంతకీ దిల్ రాజు అసహనానికి కారకులెవరో తెలుసా? డి.సురేశ్ బాబు, రానా. వీరు చేసిన తప్పేంటి? అసలేం జరిగింది? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలనుకుంటున్నారా? సరే... వివరాల్లోకి వెళ్దాం.
‘జయ జానకీ నాయక’, ‘లై’, ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలు... ఈ నెల 11న విడుదల కానున్నాయి. అయితే... ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రాన్ని 11న విడుదల చేయాలని మొదట అనుకోలేదు. ఈ చిత్రం తమిళ వెర్షన్ ఈ నెల 18న విడుదల కానుంది. దాంతో పాటే తెలుగు వెర్షన్ కూడా విడుదల చేయాలని మొదట్టో సురేశ్ బాబు, రానా అనుకున్నారు. అయితే... 11న విడుదలైతే.. అయిదు రోజుల వసూళ్లు కలిసి వస్తాయ్ అనుకొని వాళ్లు కూడా 11నే డేట్ ఎనౌన్స్ చేశారు. దిల్ రాజు అసహనానికి కారణం అదేనట.
నితిన్‘లై’ చిత్రం నైజాం హక్కులకు దిల్ రాజు సొంతం చేసుకున్నాడు. ఆ సినిమాను అత్యధిక థయేటర్లలో విడుదల చేయాలని కూడా ఆయన చాలా ప్లాన్స్ వేసుకున్నారు. ఇప్పుడు 11న మరో సినిమా పోటీలో నిలవడంతో థియేటర్లు అనుకున్న స్థాయిలో దొరకని పరిస్థితి. దాంతో రెవిన్యూపై ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. దాంతో దిల్ రాజు అసహనానికి లోనైనట్టు టాక్.
దిల్ రాజు, సురేశ్ బాబులకు మంచి మిత్రుడైన అల్లు అరవింద్ ఈ విషయంపై జోక్యం చేసుకొని పరిస్థితులను చక్కపెట్టే పనిలో ఉన్నట్లు తెలసింది.