రామ్చరణ్ ఫస్ట్ హీరోయిన్ ఇప్పుడేం చేస్తోంది?
on Mar 1, 2021
మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా రామ్చరణ్ 'చిరుత' (2007) మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన యాక్షన్ అండ్ లవ్ స్టోరీలో హీరోయిన్గా బిహార్కు చెందిన నేహా శర్మ నటించింది. ఆమెకు కూడా నటిగా అదే ఫస్ట్ ఫిల్మ్. మంచి ఒడ్డూపొడుగూ, గ్లామర్ ఆమె సొంతం. ఆ సినిమా తర్వాత వరుణ్ సందేశ్తో 'కుర్రాడు' సినిమాలో నాయికగా నటించిందామె. అంతే.. ఆ తర్వాత మళ్లీ టాలీవుడ్లో దర్శనమివ్వలేదు నేహ.
న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసిన నేహది రాజకీయ కుటుంబం. ఆమె తండ్రి అజీత్ శర్మ మొదట్లో వ్యాపారవేత్త. తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టి కాంగ్రెస్ తరపున భాగల్పూర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తండ్రి తరపున పలు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంది నేహ.
కథక్లో ప్రవీణురాలైన నేహ టాలీవుడ్లో రెండు సినిమాలు చేశాక, బాలీవుడ్కు వెళ్లిపోయింది. తొలిగా 'క్రూక్' (2010)లో ఇమ్రాన్ హష్మి జోడీగా నటించింది. ఆ తర్వాత క్యా సూపర్ కూల్ హై హమ్, యమ్లా పగ్లా దీవానా 2, యంగిస్తాన్, తుమ్ బిన్ 2, ముబారకన్ లాంటి సినిమాల్లో నటించింది. దుల్కర్ సల్మాన్తో చేసిన 'సోలో' మూవీతో 2017లో కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. అజయ్ దేవ్గణ్ బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ 'తానాజీ'లో విలన్ సైఫ్ అలీఖాన్ ప్రేయసిగా అలరించింది నేహ.
ప్రస్తుతం నవాజుద్దీన్ సిద్దిఖీ సరసన నాయికగా 'జోగిరా సర ర ర' అనే సినిమాలో నటిస్తోంది. సోమవారం లఖ్నవ్ సమీపంలోని బారాబంకీ అనే చిన్న టౌన్లో ఈ సినిమాలో కొన్ని సీన్లు తీశారు. కొంతమంది ఆకతాయిలు విలేజ్ గాళ్ అయిన నేహను అల్లరి చేస్తుంటే, నవాజుద్దీన్ వచ్చి వాళ్లను చితక్కొట్టి, ఆమెను రక్షించే సీన్లు తీశారు. ప్రస్తుతం నేహకు 33 సంవత్సరాలు.
Also Read