ప్రశాంత్ నీల్తో ప్రభాస్ 'సలార్'! 'రాధే శ్యామ్' తర్వాత మూవీ ఇదే!!
on Dec 2, 2020
ఊహించినట్లే జరిగింది. 'కేజీఎఫ్: చాప్టర్ 2' తర్వాత ప్రభాస్ను డైరెక్ట్ చేయడానికి ప్రశాంత్ నీల్ గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడు. రెండు రోజుల క్రితం హోంబళే ఫిలిమ్స్ డిసెంబర్ 2 మధ్యాహ్నం తమ మూడో ఇండియన్ ఫిల్మ్ను అనౌన్స్ చేస్తామని ట్విట్టర్ ద్వారా తెలిపిన విషయం తెలిసిందే. అప్పుడే అది ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబో మూవీ అవుతుందని చాలామంది ఊహించారు. ఎందుకంటే అంతకుముందే ప్రభాస్తో ప్రశాంత్ భేటీ అయిన విషయం వెల్లడైంది.
ఊహలకు తగ్గట్లే హోంబళే ఫిలిమ్స్ తమ మూడో చిత్రాన్ని ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ప్రకటించింది. ఆ మూవీకి 'సలార్' అనే టైటిల్ను సైతం ప్రకటించేసింది. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తన బ్యానర్లో మూడో ప్యాన్ ఇండియా మూవీ 'సలార్'ను నిర్మించనున్నట్లు హోంబళే ఫిలిమ్స్ అధినేత విజయ్ కిరంగదూర్ వెల్లడించారు. అంతేకాదు, మూవీలో ప్రభాస్ లుక్ను కూడా విడుదల చేశారు.
విజయ్ కిరగందూర్ మాట్లాడుతూ "మా బ్యానర్లో కె.జి.యఫ్ చాప్టర్ 1, కె.జి.యఫ్ చాప్టర్ 2 వంటి ప్యాన్ ఇండియా చిత్రాల తర్వాత మూడో ప్యాన్ ఇండియా చిత్రాన్ని రూపొందించబోతున్నాం. అటు ప్రేక్షకులు, ఇటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను రూపొందించనున్నారు. బాహుబలిగా ప్రపంచ సినీ ప్రేక్షకులను అలరించిన ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో సినిమా షూటింగ్ను స్టార్ట్ చేయబోతున్నాం. ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న 'రాధే శ్యామ్' విడుదల తర్వాత ఈ సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాం. ప్యాన్ ఇండియా మూవీగా రూపొందనున్న ‘సలార్’ చిత్రాన్ని భారతీయ భాషలన్నింటిలో రూపొందిస్తాం" అన్నారు.
Also Read