ప్రధానమంత్రి ఫండ్కి ఇస్తే ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలుసు?
on Mar 31, 2020
సల్మాన్ ఖాన్ గ్రేట్ అని కొరియోగ్రాఫర్ యానీ మాస్టర్ అంటున్నారు. ఈటీవీ డాన్స్ రియాలిటీ షో 'ఢీ' ద్వారా కెమెరా వెనుక మాత్రమే పరిమితం కాకుండా కెమెరా ముందుకూ వచ్చారీమె. అందువల్ల, మెజార్టీ ప్రేక్షకులకు కూడా తెలుసు. కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న 25,000 మంది సినీ కార్మికులకు సహాయం చేయడానికి ముందుకొచ్చిన సల్మాన్ ఖాన్ మీద యానీ ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో ప్రధానమంత్రి సహాయనిధికి 25 కోట్ల రూపాయలు విరాళాన్ని ఇచ్చిన అక్షయ్ కుమార్ మీద పరోక్షంగా విమర్శలు చేశారు. అసలు వివరాల్లోకి వెళితే...
"సల్మాన్ ఖాన్.., తుస్సీ గ్రేట్ హో. సినీ ఫీల్డ్లోని 25,000 మంది వర్కర్స్కి డైరెక్టుగా డబ్బులు ఇవ్వడం... మీరు మంచి పని చేశారు. నాకింకా గుర్తుంది... మీరు నాకు బహుమతిగా ఇచ్చిన 1,00,000 రూపాయలతో మా అమ్మకు మోకాలి (knee replacement) సర్జరీ చేయించా. ప్రధానమంత్రి ఫండ్కి ఇవ్వడం వల్ల అది ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలుసు. సల్మాన్... లవ్యూ" అని యానీ పేర్కొన్నారు,
తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి ప్రధానమంత్రి సహాయనిధికి ప్రభాస్ రూ. 3 కోట్లు, పవన్ కళ్యాణ్ రూ. 1 కోటి ఇచ్చారు. మరికొందరు హీరోలు సహాయం ఇచ్చారు. అయితే... బాలీవుడ్ నుండి అక్షయ్ కుమార్ రూ. 25 కోట్లు ఇచ్చారు. సల్మాన్ ఖాన్ మీద ప్రశంసలు కురిపించడం ద్వారా ఆమె అక్షయ్ని తక్కువ చేశారని గుసగుస.