తిరు.. బిగ్ టికెట్ ఫిల్మ్స్ డబుల్ ధమాకా!
on Mar 2, 2021
తమిళ, తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో ఛాయాగ్రాహకుడిగా తనదైన ముద్రవేస్తున్నారు తిరు. 1994లో విడుదలైన తమిళ చిత్రం `మగళిర్ మట్టుమ్` (తెలుగులో `ఆడవాళ్ళకు మాత్రమే`)తో సినిమాటోగ్రాఫర్ గా తొలి అడుగేసిన తిరు.. `నవ్వండి లవ్వండి`, `హే రామ్`, `క్రిష్ 3`, `24` వంటి అనువాద చిత్రాలతో తెలుగువారికి చేరువయ్యారు. యంగ్ టైగర్ యన్టీఆర్ నటించిన `జనతా గ్యారేజ్`తో తెలుగులో తొలిసారిగా నేరుగా పనిచేసిన తిరు.. ఆపై సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో `భరత్ అనే నేను` చేశారు.
ఇదిలా ఉంటే.. ఈ ఏడాది మే 13 తిరుకి ఎంతో ప్రత్యేకం కానుంది. ఎందుకంటే.. ఆ రోజు తిరు కెమెరామెన్ గా పనిచేసిన రెండు బిగ్ టికెట్ ఫిల్మ్స్ థియేటర్స్ లో సందడి చేయనున్నాయి. ఆ చిత్రాలే.. `ఆచార్య`, `మరక్కర్.. అరబిక్ కడలింటే సింహం`. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తెలుగు సినిమా `ఆచార్య` మే 13న రిలీజ్ కానుండగా.. మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం `మరక్కర్` పలు భాషల్లో అదే రోజున విడుదల కానుంది. ఈ రెండు సినిమాలకు కూడా తిరు ఛాయాగ్రహణం ప్రత్యేక ఆకర్షణ కానుందని ప్రచార చిత్రాలను బట్టి స్పష్టమవుతోంది. మరి.. తిరుకి ఈ బిగ్ టికెట్ ఫిల్మ్స్ డబుల్ ధమాకా కెరీర్ కి ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.
Also Read