పుష్ప.. ఇప్పుడు బాబీ డియోల్ వంతు!
on Jan 21, 2021
రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ తరువాత సుకుమార్ డైరెక్షన్ లోనూ.. అల వైకుంఠపురములో వంటి ఘనవిజయం తరువాత అల్లు అర్జున్ కథానాయకుడిగానూ రూపొందుతున్న చిత్రం పుష్ప. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్.. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో బన్నీ నెవర్ బిఫోర్ సీన్ రోల్, లుక్ లో దర్శనమివ్వబోతున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో విలన్ పాత్ర చాలా కీలకం. కథానాయకుడి పాత్రకి దీటుగా ప్రతినాయకుడి క్యారెక్టర్ ఉంటుందట. అందుకే.. తొలుత మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ విజయ్ సేతుపతిని విలన్ రోల్ కి లాక్ చేశారు. కాల్షీట్ల సమస్య కారణంగా తను తప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో.. ఆర్య, శింబుతో పాటు పలువురు ప్రముఖ నటుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్.. పుష్పలో బ్యాడీగా నటించబోతున్నాడట. ఇప్పటికే ఈమేరకు సంప్రదింపులు కూడా జరిగాయని టాక్. త్వరలోనే పుష్పలో బాబీ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
కాగా, పుష్పలో రష్మిక మందన్న నాయికగా నటిస్తుండగా.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు.