కరాటే కల్యాణి దృష్టిలో టాప్ 5, బాటమ్ 5 కంటెస్టెంట్లు!
on Sep 20, 2020
బిగ్ బాస్ 4 సీజన్ వీకెండ్ సన్ డే ఎపిసోడ్ ఫన్ గా సాగింది. ఈ వారం హౌస్ నుంచి ఇద్దరు ఎలిమినేట్ అవుతారని నాగార్జున పేల్చిన బాంబు తుస్సుమంది. రెండు రోజులుగా ఎలిమినేషన్ లో ఉన్న కంటెస్టెంట్లలో, టీవీల ముందు కూర్చున్న ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేకెత్తించినప్పటికీ చివరకు కరాటే కల్యాణి ఒక్కరే రెండోవారం ఇంటిదారి పట్టారు. దాంతో నాగార్జున ఇంటి సభ్యులతో గేమ్ ఆడుతున్నారు అని అర్థమైంది.
మొదటివారం "మీలో కట్టప్ప ఉన్నాడు" అంటూ కంటెస్టెంట్ల మధ్య టాస్క్ లు ఇచ్చి చివరికి "తూచ్.. కట్టప్ప ఎవరూ లేరు" అంటూ తేల్చి చెప్పారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పి.. చివరికి "తూచ్ మీరు ఆట సీరియస్ గా ఆడాలనే" అంటూ జోక్ చేశారు. దాంతో కంటెస్టెంట్లు అంతా ఊపిరి పీల్చుకున్నా ప్రేక్షకులు మాత్రం ఇంటి సభ్యులతో నాగార్జున భలే గేమ్ ఆడుతున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
బిగ్ బాస్ లో ఎలిమినేట్ అయిన కళ్యాణి నాగార్జునతో కలిసి స్టేజ్ పై ఈ రెండువారాలు బిగ్ హౌస్ లో తన రోల్ రీప్లే చూసింది. హౌస్ లో తాను ఉండలేకపోయానని అందుకే తాను సెల్ప్ నామినేట్ అయ్యాను అంది. హౌస్ నుంచి వెళ్ళిపోతున్న ఆమెకు నాగార్జున ఇచ్చిన టాస్క్ లో భాగంగా బిగ్ హౌస్ కంటెస్టెంట్లలో టాప్ 5, బాటమ్ 5 ఫొటోలను బోర్డ్ పై అమర్చింది. టాప్ 5గా హారిక, అమ్మ రాజశేఖర్, మోనాల్, దివి, అభిజిత్ ఫొటోలను, బాటమ్ ఫైవ్ గా గంగవ్వ, కుమార్ సాయి, అరియానా, సుజాత, సోహైల్ ఫొటోలను పెట్టింది.
దేవి బ్రిలియంట్, అవినాష్ అమాయక చక్రవర్తి, మెహబూబ్ ఇంటిలిజెంట్, లాస్య ఇన్నోసెంట్, అఖిల్కు కోపమెక్కువని చెప్పింది. హౌస్లో కట్టప్పలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు అంటూ కామెంట్ చేసింది. వచ్చేవారం ఎలిమినేషన్ లో దేవి నాగవల్లిని చేర్చుతూ బిగ్ బాంబ్ వేసింది. స్టేజీపై రాగయుక్తంగా కళ్యాణి చెప్పిన డైలాగ్స్, ఆమె ఫర్మామెన్స్ తో నాగార్జున ఆశ్చర్యపోయారు. ఆమెను అభినందిస్తూ షో నుంచి వీడ్కోలు చెప్పారు.
Also Read