రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కిడ్నాప్
on May 25, 2017
ఇప్పుడు రాజమౌళి అంటే యూనివర్శిల్ డైరెక్టర్..బాహుబలితో ఇండియన్ మూవీ ఇండస్ట్రీ స్టామినా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాడు. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా రాజమౌళి నెక్ట్స్ ఏం ప్రాజెక్ట్ చేయబోతున్నాడా అని ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. దర్శకధీరుడు ఈ స్థాయికి రావడం వెనుక ఆయన కష్టం ఎంత ఉందో..అంతే పాత్ర పోషించారు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్. విభిన్నమైన కథలతో, మంచి అభిరుచిగల రచయితగా టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్నారు . రైటర్గానే కాకుండా మెగాఫోన్ పట్టి దర్శకుడిగానూ మంచి సినిమాలు తీశారు. అలాంటి విజయేంద్రప్రసాద్ కిడ్నాప్కు గురయ్యారు. ఆయనను చిత్రహింసలు పెట్టి 60 లక్షల రూపాయల చెక్కు రాయించుకున్నారు గుర్తు తెలియని వ్యక్తులు.
అయితే ఇదంతా జరిగింది ఇప్పుడు కాదు. ఓ హత్య కేసులో ప్రముఖ సినీ నిర్మాత, మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావుకు న్యాయస్థానం యావజ్జీవ శిక్ష విధించింది. అతని గురించి చేసిన ఎంక్వైరీలో అనేక వాస్తవాలు బయటపడ్డాయి. ఇదే క్రమంలో రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్కు చెంగల వెంకట్రావ్కు మధ్య జరిగిన గొడవ విషయం వెలుగులోకి వచ్చింది. చెంగల తన వద్దకు ఓ కథ కోసం వచ్చారని..తనకు డబ్బులివ్వకుండా రూ.30 లక్షల రూపాయలకు రశీదు తీసుకున్నారని..ఆ తర్వాత తనను కిడ్నాప్ చేసి, సీసీఎస్ కార్యాలయంలో నిర్భంధించి తనను కొట్టి..60 లక్షల రూపాయల చెక్కు రాయించుకున్నారని..అప్పట్లో మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు విజయేంద్రప్రసాద్. దీనికి ప్రతీగా విజయేంద్రప్రసాద్పై చెక్ బౌన్స్ కేసును వేశారు చెంగల. దీనిపై వాదోపవాదాల అనంతరం న్యాయస్థానం ఆ కేసును కొట్టివేసింది.