'నిశ్శబ్దం' ఆలస్యానికి కారణం అనుష్క బరువే?
on Sep 18, 2020
'సైజ్ జీరో' సినిమా కోసం అనుష్క శెట్టి బరువు పెరిగారు. ఆ తర్వాత నుండి తగ్గడం ఆమె వల్ల కావడం లేదు. బరువు తగ్గడం కోసం చేసే ప్రయత్నాలు ఏవీ ఫలించడం లేదు. 'బాహుబలి'లో కొన్ని సన్నివేశాలలో ఆమెను సన్నగా చూపించడం కోసం సీజీ వర్క్ చేశారని టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కొందరు చెప్పుకుంటూ ఉంటారు. అందులో ఎంత నిజం ఉందో తెలియదు గానీ... 'నిశ్శబ్దం' సినిమాలోనూ అనుష్కను సన్నగా చూపించడానికి సీజీ వర్క్ చేస్తున్నారని తాజా గుసగుస.
హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్ర పోషించిన సినిమా 'నిశ్శబ్దం'. తమిళ హీరో మాధవన్, హాలీవుడ్ నటుడు మైఖేల్ మ్యాడసన్, హీరోయిన్లు అంజలి, శాలిని పాండే, నటులు సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్ తదితరులు నటించిన ఈ సినిమా త్వరలో ఓటిటిలో విడుదల కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకుంది. గాంధీ జయంతికి అక్టోబర్ 2న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. సినిమాకు ఆఫర్ ఎప్పుడో వచ్చినప్పటికీ... విడుదల ఆలస్యం కావడం వెనుక అనుష్క బరువు ప్రధాన కారణంగా నిలిచిందని ఫిలింనగర్ గుసగుస.
Also Read