అనూప్ రూబెన్స్.. 2 క్రేజీ సీక్వెల్స్!
on Mar 7, 2021
'జై' (2004)తో సంగీత దర్శకుడిగా పరిచయమైనా.. 'ప్రేమకావాలి' (2011)తోనే కెరీర్ లో తొలి హిట్ అందుకున్నాడు సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్. ఆపై 'మనం', 'గోపాల గోపాల', 'టెంపర్', 'సోగ్గాడే చిన్ని నాయనా' వంటి బిగ్ టికెట్ ఫిల్మ్స్ తోనూ అలరించాడు. మధ్యలో కాస్త ట్రాక్ తప్పినట్లు అనిపించినా.. '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' లోని "నీలి నీలి ఆకాశం" పాట.. అతణ్ణి మళ్ళీ లైమ్ లైట్ లోకి తీసుకువచ్చింది.
కట్ చేస్తే.. ప్రస్తుతం అనూప్ రూబెన్స్ చేతిలో దాదాపు ఎనిమిది చిత్రాలు ఉన్నాయి. వాటిలో అరడజను సినిమాలు లో-బడ్జెట్ మూవీసే అయినా రెండు మాత్రం క్రేజీ ప్రాజెక్ట్స్. అంతేకాదు.. ఆ రెండు కూడా సీక్వెల్స్ కావడం విశేషం.
ఆ వివరాల్లోకి వెళితే.. 'సోగ్గాడే చిన్ని నాయనా'కి కొనసాగింపుగా 'బంగార్రాజు' పేరుతో రూపొందుతున్న సినిమాకి.. 'దృశ్యం'కి సీక్వెల్ గా రూపొందుతున్న 'దృశ్యం 2'కి అనూప్ రూబెన్స్ నే స్వరకర్త. కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేశ్ చేస్తున్న ఈ సీక్వెల్స్ అనూప్ కి ఎలాంటి ఫలితాలను అందిస్తాయో చూడాలి. కాగా, 'దృశ్యం 2' జూన్ లేదా జూలైలో విడుదల కానుండగా.. 'బంగార్రాజు' 2022 సంక్రాంతికి రిలీజ్ కానుంది.