బాలకృష్ణ-బోయపాటి మూవీలో మలయాళీ బ్యూటీ?
on Jul 4, 2020
నట సింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా సినిమా (బిబి3) టీజర్ ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 'సింహా', 'లెజెండ్' సినిమాల్లో బాలకృష్ణను పవర్ఫుల్గా చూపించిన బోయపాటి, ఈసారి ఎలా చూపిస్తారోనని ఎదురు చూసిన అభిమానులు, ప్రేక్షకులకు అంతకు మించి చూపించాడు. కరోనా బ్రేక్ వల్ల సినిమా ఆలస్యమైంది కానీ... లేదంటే జెట్ స్పీడ్తో బాలకృష్ణ, బోయపాటి పూర్తి చేసేవారు.
కరోనాకి ముందు కథానాయిక అవసరం లేని సన్నివేశాలు చాలావరకు బోయపాటి తెరకెక్కించారు. హీరో మీద పవర్ఫుల్ ఫైట్స్ తీశారు. హీరోయిన్ ఫైనలైజ్ చేసి షెడ్యూల్ స్టార్ట్ చేయాలనుకున్న టైమ్లో కరోనా వచ్చింది. బ్రేక్ ఇచ్చింది. మళ్ళీ నెమ్మదిగా షూటింగ్స్ స్టార్ట్ కావడానికి అనువైన వాతావరణం వచ్చే సూచనలు కనిపించడంతో హీరోయిన్ సెలక్షన్ మీద కాన్సంట్రేట్ చేశారట.
సినిమా ప్రారంభమైన సమయంలో కేథరిన్ పేరు వినిపించింది. తరవాత రాశీ ఖన్నాను తీసుకుంటే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారని గుసగుసలు వినిపించాయి. అంజలి చేయవచ్చని వార్తలు వచ్చాయి. పుకార్లు షికార్లు చేస్తున్న సమయంలో కొత్త కథానాయికను తీసుకోవాలని అనుకుంటున్నట్టు బోయపాటి చెప్పారు. ముంబై బ్యూటీని ఫైనలైజ్ చేశారని యూనిట్ వర్గాల నుండి వినిపించింది. ఇప్పుడు మనసు మార్చుకుని మలయాళీ బ్యూటీని సంప్రదించారట. తెలుగులో అల్లు అర్జున్ సరసన 'ఇద్దరమ్మాయిలతో', రామ్ చరణ్ 'నాయక్'లో ఓ కథానాయికగా నటించిన అమలా పాల్ పేరు బాలకృష్ణ కొత్త సినిమాలో కథానాయికగా వినిపిస్తోంది. నిజమో కాదో తెలియాలి.