`పిల్లజమీందార్ `కు మా సినిమాకు ఏమాత్రం సంబంధం లేదుః అల్లు శిరీష్
on May 15, 2019
`ఒక్కక్షణం` చిత్రం తర్వాత అల్లు శిరీష్ నటిస్తోన్న చిత్రం `ఏబిసిడి`. మధుర శ్రీధర్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రం ఈ నెల 17న విడుదలకు సిద్దమవుతోంది. ఈ సందర్భంగా అల్లు శిరీష్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు..
`ట్రైలర్ విడుదలయ్యాక అందరూ పిల్లజమీందార్ చిత్రంతో పోలుస్తున్నారు, ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో నాని కూడా అలాగే అన్నాడు దీనికి మీరేమంటారు అని అడగ్గా...`` పిల్ల జమీందర్ చిత్రంలో హీరో, తాత పెట్టిన కండిషన్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాడు. మా సినిమాలో అలా కాదు యుఎస్ లో ఉంటూ టైమ్, మనీ, లైఫ్ అంటే ఏంటో తెలియని నన్ను, వాటి వాల్యూ తెలుసుకోవడానికి మా ఫాదర్ ఇండియాకు పంపిస్తాడు. ఇండియాకు వచ్చాక నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాను. ఏంటి? అన్నది సినిమా. కాబట్టి ట్రైలర్ చూసి అలా అనుకుంటున్నారేమో కానీ, పిల్ల జమీందార్ సినిమాకు మా `ఏబిసిడి` సినిమాకు ఏ మాత్రం సంబంధం లేదు. ఇక నా రియల్ లైఫ్ లో కూడా మా ఫాదర్ అలాగే టైమ్, మనీ వాల్యూ తెలియడానికి చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరించేవారు. అలా నాకు సినిమాకు చాలా కనెక్టయింది. సినిమాలో క్యారక్టర్ కు, నా క్యారక్టర్ కు చాలా దగ్గర పోలికలుంటాయి. ఇక దర్శకుడు చాలా కేర్ తీసుకుని తీసాడు. నిర్మాత మధుర శ్రీధర్ గారు ఎక్కడా రాజీ పడకుండా సినిమా తీసారు. సాండీ అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు., ఆర్ ఆర్ కూడా చాలా బాగా కుదిరింది. త్వరలో లవ్ స్టోరి చేయబోతున్నా , ఆ వివరాలు అతి త్వరలో వెల్లడిస్తా`` అన్నారు.