'ఎవడు' కాంబినేషన్ రిపీట్ కానుందా?
on Apr 13, 2019
ప్రెసెంట్ రాంచరణ్, ఎన్టీఆర్ తో కలిసి `ఆర్ ఆర్ ఆర్` మూవీలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. రాజమౌళి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ జులై 30న రిలీజ్ కానుంది. అయితే రాంచరణ్ తదుపరి సినిమాకు సంబంధించి ఒక న్యూస్ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది. తాజాగా చరణ్, వంశి పైడిపల్లి తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది.
ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చరణ్ తో వంశి పైడిపల్లి `ఎవడు` సినిమా చేసాడు. ఈ సినిమా బాగానే ఆడింది. ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో సినిమా రాలేదు. ఇటీవల చరణ్ కు స్టోరీ లైన్ చెప్పాడట వంశీ. నచ్చడం తో ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను కూడా డి..వి .వి దానయ్య నిర్మిస్తాడని టాక్.
అన్ని కుదిరితే నెక్స్ట్ ఇయర్ లో ఈ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం వంశి పైడిపల్లి మహేష్ తో మహర్షి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మే లో విడుదలకానుంది.