200 మిలియన్స్ తో ఫిదా చేసిన సాయి పల్లవి సాంగ్ !!
on May 7, 2019
`వచ్చిండే ...మెల్ల మెల్లగ వచ్చిండే క్రీమ్ బిస్కట్ ఏసిండే...అంటూ అందర్నీ మాయ చేసింది `ఫిదా` సినిమాలోని ఈ సాంగ్. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ హీరోగా నటించగా, సాయిపల్లవి హీరోయిన్ గా నటించింది. పాటే కాదు సాయి పల్లవి ఈ పాటలో తన పర్ఫార్మెన్స్ తో ఫిదా చేసేసింది. శక్తికాంత్ స్వరపరిచగా సుద్దాల అశోక్ తేజ తెలంగాణ స్లాంగ్ లో ఈ పాటను అద్భుతంగా రాసారు. ఇక ఈ పాట ఇప్పుడు ఏకండా 200 మిలియన్స్ వ్యూస్ సంపాదించుకుని యూట్యూబ్ నే ఫిదా చేసింది. ఇప్పటికీ ఏ ఫంక్షన్ లో విన్నా ఈ పాటే వినిపిస్తోంది. ఈ పాటను మధుప్రియ తనదైన శైలిలో పాడింది.