నాగ్, ఎన్టీఆర్ వచ్చారనే, బాలకృష్ణ రాలేదా?
on Apr 25, 2018
నిన్న జరిగిన టాలీవుడ్ మీటింగ్ కి ఇండస్ట్రీ లో ఉన్న దాదాపు అందరు హీరోలు అటెండ్ అయ్యారు. నాగార్జున, వెంకటేష్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, నాని, కళ్యాణ్ రామ్, నాగ చైతన్య, అఖిల్, సుమంత్, రాజ్ తరుణ్, నరేష్ లతో పాటు అల్లు అరవింద్, కిరణ్, NV ప్రసాద్, KL నారాయణ, తమ్మారెడ్డి భరద్వాజ, మంచు లక్ష్మి తదితరులు ఈ మీటింగ్ కి హాజరయ్యారు. అయితే, బాలకృష్ణ మాత్రం ఈ మీటింగ్ కి వెళ్ళడానికి ఎడ మొహం చూపించాడు. ఇంతకీ, బాలకృష్ణ ఈ మీటింగ్ కి వెళ్లకపోవడానికి కారణం ఏంటి? ఇండస్ట్రీ సోర్సెస్ ప్రకారం తనంటే అస్సలు గిట్టని నాగార్జున, ఎన్టీఆర్ లు ఈ మీటింగ్ కు రావడం బాలకృష్ణ కి నచ్చలేదట. అందుకనే, చిరంజీవి ప్రత్యేకంగా ఫోన్ చేసి పిలిచినా కూడా వెళ్లకుండా ఉండిపోయాడట. ఇది కాకుండా, ఛానెల్స్ ని బ్యాన్ చేయడం అనే ఆలోచన బాలకృష్ణ కి నచ్చ లేదట. అయితే, బాలకృష్ణ ఈ మీటింగ్ స్కిప్ అవ్వడానికి కులం చిచ్చు పెట్టే ప్రయత్నాలు కొందరు చేస్తున్నారు. అయితే, ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదంటున్నారు. త్వరలో, టాలీవుడ్ ప్రముఖులు మరిన్ని విషయాలు డిస్కస్ చేసేందుకు మళ్ళీ మీట్ అవ్వనున్నారు.