'ఆర్ ఆర్ ఆర్'.. ఆసక్తికరమైన సన్నివేశమదే...
on Nov 30, 2020
వాస్తవ పాత్రలు, కల్పిత ఘట్టాలతో దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న పిరియడ్ డ్రామా 'ఆర్ ఆర్ ఆర్'. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, కొమురం భీమ్ గా యంగ్ టైగర్ యన్టీఆర్ నటిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ పుణేలో జరుగుతోందని సమాచారం.
ఇదిలా ఉంటే.. 'ఆర్ ఆర్ ఆర్'కి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. సినిమాలో కీలకమైన రామ్, భీమ్ తొలిసారిగా కలిసే సన్నివేశమిదే అంటూ కొన్ని కథనాలు వస్తున్నాయి. ఇంతకీ ఆ సీన్ ఎలా సాగుతుందంటే.. అటవీ ప్రాంతంలో 300 మంది ఆదివాసులు, 100 మంది పోలీసుల మధ్య కొమురం భీమ్ పై భారీ పోరాట ఘట్టం ఉంటుందట. ఆ సందర్భంలోనే భీమ్, అల్లూరి రామరాజు తొలిసారిగా కలుస్తారట. అక్కడ నుంచే ఇద్దరు కలిసి పోరాటం సాగిస్తారట. సిల్వర్ స్క్రీన్ మీద ఈ సీన్.. గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుందని బజ్.
మరి.. ఈ వార్తల్లో నిజానిజాలెంతో తెలియాలంటే వచ్చే ఏడాది ద్వితీయార్ధం వరకు వేచిచూడాల్సిందే. డీవీవీ దానయ్య ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ మల్టిస్టారర్ కి ఎం.ఎం. కీరవాణి బాణీలు అందిస్తున్నారు.