ప్రభాస్ బుల్లితెర మీదకి...సాహోకి ముందే !
on Jun 28, 2019
సోషల్ మీడియాకి, మీడియాకి అన్నిటికీ చాలా అంటే చాలా దూరంగా ఉంటాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. తన సినిమా ఫంక్షన్స్ కి తప్ప వేరే వారి ఫంక్షన్స్ కి కూడా తప్పదు అనుకుంటే తప్ప వెళ్ళడు. ఏదైనా ఫంక్షన్ లో హాజరయినా కానీ ఒక్క మాట మాట్లాడి వెళ్తాడు తప్ప పెద్ద ఇన్వాల్వ్ అవ్వడు. అయితే అలంటి సిగ్గరి ప్రభాస్ ని ఇప్పుడు ఏకంగా బుల్లితెర షోలో భాగం చేస్తున్నట్టు చెబుతున్నారు. గతంలో ‘కొంచెం టచ్ లో ఉంటె చెప్తా’ అనే షో యాంకర్ ప్రదీప్ ఆధ్వర్యంలో వచ్చి మంచి టీఆర్పీలు సాధించింది. ఈ షో మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుని నాలుగో సీజన్ ప్రారంభానికి రెడీ అవుతోంది.
అయితే ఈ షో నాలుగో సీజన్ ప్రారంభానికి స్పెషల్ గెస్ట్ గా ప్రభాస్ ని తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారట జీ టీవీ నిర్వాహకులు. అయితే నిజం ఎంతో తెలీదు కానీ ఈ షోకి ప్రభాస్ రావాడానికి ఒప్పుకున్నాడని ప్రచారం మొదలయ్యింది. దానికి కారణం సాహో సినిమా హిందీ శాటిలైట్ హక్కుల్ని జీ గ్రూప్ ఏకంగా 50 కోట్ల రూపాయకి దక్కించుకుంది. అందుకే వారు ప్రమోషన్స్ కూడా అయినట్టు ఉంటుందని ప్రభాస్ ను అడిగి ఒప్పించారట. సాహో సినిమా ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తోంది.