`మహర్షి` మొదటి పాట వచ్చేస్తోంది!!
on Mar 23, 2019
మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `మహర్షి`. గత కొంత కాలంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం నుండి మొదటి పాట ఈ నెల 29న విడుదల కానుంది. ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ తెలియజేశారు. దీంతో మహేష్ అభిమానులు పాట కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరపుకుంటోంది.
ఈ చిత్రంలో విడుదలయ్యే మొదటి పాట సినిమాకే కీలకమైన పాట అని తెలుస్తోంది. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించారట. ఇందులో మొత్తం ఐదు పాటలున్నాయట. రెండో పాటను ఉగాది కానుకగా విడుదల చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.