ఎయిర్ పోర్ట్లో మహేష్కి ఘోర అవమానం..!
on Feb 25, 2019
`ప్రస్తుతం మహేష్ `మహర్షి` చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. మహేష్ ఇందులో మూడు విభిన్నమైన గెటప్స్ లో కనిపించనున్నాడు. వంశీ పైడి పల్లి దర్శకత్వంలో దిల్ రాజు, అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కి వెళ్లిన మహేష్ బాబుకు ఘోర అవమానం జరిగిందట. మహేష్ ను ఎయిర్ పోర్ట్ లోకి రానివ్వకపోవడంతో ఆయన పార్కింగ్ లో తన కారులోనే దాదాపు నాలుగు గంటలు వెయిట్ చేయాల్సి వచ్చిందట. ఒకసారి పూర్తి వివరాల్లోకి వెళితే... రైతు సమస్యల బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మహేష్ విదేశాల్లో నుంచి హైదరాబాద్ కు వచ్చే ఒక సన్నివేశం ఉంటుందట. ఈ సన్నివేశాన్ని తెరకెక్కించడానికి మహర్షి టీమ్ శంబాషాబాద్ లో ని ఎయిర్ పోర్ట్ కు చేరుకుంది. ఉదయమే 7 గంటలకు ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నాడు మహేష్. అయితే షూటింగ్ చేయకూడదని టీమ్ ని ఎయిర్ పోర్ట్ అధికారులు అడ్డగించారు. . షూటింగ్ కోసం ఆల్ రెడీ పర్మిషన్ తీసుకున్నామని చెప్పినా కూడా ఢిల్లీ నుంచి పై అధికారుల పర్మిషన్ ఇచ్చే వరకు షూటింగ్ చేయవద్దని అధికారులు చెప్పడంతో మహేష్ బయటే వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎంతకు లోపలకు పంపకపోవడంతో మహేష్ వెను తిరిగారట. పుల్వామా దాడి ఎఫెక్ట్ వల్ల హైఅలర్ట్ పెట్టడంతో షూటింగ్ కోసం పర్మిషన్ ఇవ్వలేదని తెలుస్తోంది.