2018లో వెండి తెరపై సందడి చేయని హీరోలు
on Dec 27, 2018
దాదాపు 2018 ఆఖరికి వచ్చేశాం. ఈ ఏడాది తెలుగులో ఉన్న అగ్ర హీరోలందరూ వెండితెర పై సందడి చేశారు. కానీ, కొంత మంది హీరోలు మాత్రం సినిమాలు చేస్తున్న 2018 లో బాక్సాఫీస్ దగ్గర సందడి చేయలేకపోయారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది చిరంజీవి. 2017 లో `ఖైదీ నంబరు 150 `తో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ .ఆ తర్వాత కథ విషయంలో ఆచితూచి చివరకు తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర పై `సైరా.. నరసింహరెడ్డి` మూవీ చేస్తున్నాడు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక `గురు` మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న వెంకటేశ్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ తేజ్ తో కలిసి `ఎఫ్ 2` మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది. మరోవైపు నాగచైతన్య చేస్తోన్న `వెంకిమామ` మూవీ కూడా 2019 లోనే రానుంది. ఇక 2018లో పవన్ కళ్యాణ్ నటించిన `అజ్ఞాతవాసి`లో వెంకీ అతిథి పాత్రలో కనిపించాడు అంతే. `బాహుబలి` తర్వాత ప్రభాస్.. సుజిత్ దర్శకత్వంలో `సాహో`మూవీ చేస్తున్నాడు.
‘బాహుబలి’తో ప్రభాస్ క్రేజ్.వరల్డ్ వైడ్గా పెరిగింది. 2018లో వెండితెరపై కనిపించని ప్రభాస్..2019లో రెండు సినిమాలతో ఆడియన్స్కు కనువిందు చేయనున్నాడు. ‘నేనే రాజు నేనే మంత్రి’ తర్వాత సీల్వర్ స్క్రీన్పై కనిపించని రానా...2018లో ఆయన నుంచి ఒక్క సినిమా రాలేదు. ఆ లోటును వచ్చే యేడాది ‘1945’, ‘హాథీ మేరా సాథీ’, రాజా రవివర్మపై తెరకెక్కే చిత్రంతో పాటు ‘హౌస్ఫుల్4’ సినిమాతో తీర్చబోతున్నాడు. 2017లో ‘గరుడ వేగ’ సినిమాతో ఫామ్లోకి వచ్చిన రాజశేఖర్..ఈ యేడాది వెండితెరపై సందడి చేయలేదు. ‘గరుడవేగ’ మూవీ ఇచ్చిన బూస్టప్తో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘కల్కి’ మూవీ చేస్తున్నాడు. ఇది 2019లో రానుంది.
అక్కినేని నట వారసుడు అఖిల్ కూడా ఈ యేడాది సందడి చేయలేదు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హలో’ మూవీ అఖిల్ హిట్ ఆశను నెరవేర్చలేదు. దీంతో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘మిస్టర్ మజ్ను’ మూవీ చేసాడు. ఈ యేడాది చివరలో ఈ మూవీ రిలీజ్ చేయాలనుకున్నారు. ఎందుకనో ఈ మూవీ 2019 జనవరికి పోస్ట్ పోన్ అయింది. వచ్చే ఏడాది వీరు వెండి తెరపై చేసే సందడి కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.