చై, సామ్ భార్యాభర్తలుగా నటిస్తున్నారా?
on Jul 23, 2018
ఎనిమిదేళ్ల క్రితం సమంత కథానాయికగా నటించిన తొలిచిత్రం ఏం మాయ చేసావే.ఈ సినిమాతో ఏం మాయ చేసిందేమోగాని నాగ చైతన్య మనసు పారేసుకున్నాడు.ఎన్నో ఆశ్చర్యాలకు గురిచేసిన వీరి ప్రేమ ప్రయాణం అప్పట్లో వైరల్ గా మారింది.అందరి ఊహాగానాలకు తెరదింపుతూ 2017లో వివాహబంధంతో ఒకటయ్యారు. అయితే పెళ్లయ్యాక చై, సామ్లు కలిసి ఇప్పటివరకు నటించలేదు.
వీరిద్దరికోసం శివ నిర్వాణ ఓ కథను సిద్ధం చేశారు.కాగా..ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాగచైతన్య, సమంతతో పాటు నాగార్జున కూడా వచ్చారు. ఈరోజు నుంచి చిత్రీకరణ మొదలుపెట్టనున్నట్లు వార్తలు వెలువడ్డాయి కానీ ఆగస్ట్ నుంచి చిత్రీకరణ మొదలు కానుందని సమంత వెల్లడించారు. ఇందులో చై, సామ్ భార్యాభర్తల పాత్రల్లోనే నటిస్తున్నట్లు తెలుస్తోంది.పెళ్లయ్యాక భార్యభర్తల మధ్య చోటుచేసుకునే చిలిపి తగాదాలు, వాళ్ల అనుబంధం నేపథ్యంలో సాగబోతోంది. సాహి గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.అవసరాల శ్రీనివాస్, రావు రమేశ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఓవైపు చై ‘సవ్యసాచి’, ‘శైలజా రెడ్డి అల్లుడు’ చిత్రాలతో బిజీగా ఉండగా మరోవైపు సామ్ 'యూటర్న్' అనే చిత్రంలో నటిస్తున్నారు.