‘రంగస్థలం’ అసలు కథ ఇదేనంట!
on Feb 1, 2018
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ‘రంగస్థలం’ సినిమాపై ఉన్న హైప్స్ అంతా ఇంతా కాదు. సుకుమార్ కెరీర్ లో ’ఆర్య’ మినహా భారీ విజయం లేకపోయినా... ఈ సినిమాపై అంచనాలు మాత్రం ఆకాశంలో ఉన్నాయ్. పైగా స్టైలిష్ సినిమాలు తీసే సుకుమార్... తన పంథాను మార్చి... పల్లెటూరి కథను ఎంచుకొని...పీరియాటికల్ డ్రామాగా 1985లో జరిగిన కథను ఎంచుకోవడంతో... సినిమాపై ఎక్కడ లేని ఆసక్తి నెలకొంది.
ఇదిలావుంటే...ఇప్పటికే ‘ఇదే... రంగస్థలం కథ ’ అంటూ రెండు కథలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయ్. మెగాస్టార్ చిరంజీవి ‘ఊరికిచ్చిన మాట’ కథనే అటుఇటు చేసి ‘రంగస్థలం’గా సుకుమార్ తీస్తున్నాడనే వార్త మొన్నటిదాకా వినిపిస్తే... ’తండ్రిని చంపిన వాడిపై ప్రతీకారం తీర్చుకునే కథ’ అంటూ మరో కథ కూడా నిన్నటివరకూ వినపడింది.
అయితే... ఈ రెండూ కరెక్ట్ కాదు... అసలైన ‘రంగస్థలం’ పాయింట్ ఇదే... అంటూ రీసెంట్ గా ఓ లైన్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఈ లైన్ బట్టి చూస్తే... ‘రంగస్థలం’ కథ ఇదేనేమో అనిపిస్తుంది. ఇక ఆ కథేంటి? అనే విషయంలోకెళ్తే...
రామ్ చరణ్(చిట్టిబాబు), ఆది పినిశెట్టి (సూరిబాబు) ఇద్దరూ అన్నదమ్ములు. అయితే.. వీరిద్దరూ విభిన్నధృవాలు. రామ్ చరణ్ మంచివాడైతే... ఆది పినిశెట్టి... చెడు సహవాసాలు పట్టి చెడ్డగా తయారవుతాడు. అతని వల్ల కుటుంబంలో సమస్యలు ఎదురవుతుంటాయ్. తమ్ముడ్ని ఎలాగైనా దారిలోకి తీసుకురావడానికి రామ్ చరణ్ చేసే ప్రయత్నాలూ... అన్నదమ్ముల మధ్య సాగే భావోద్వేగాలు... ఫస్టాప్ అంతా ఈ నేపథ్యంలోనే సినిమా సాగుతుందట. ఇక సెకండాఫ్ మొదలైన అయిదు నిమిషాలకే ఆది పినిశెట్టి పాత్ర హత్యకు గురవుతుంది. అన్యాయంగా ఆది పినిశెట్టిని చంపేస్తారు విలన్లు. తన తమ్ముడ్ని చంపిన వాడ్ని వెతికి వెతికి... వెంట బడి మరీ నరికి చంపుతాడు చిట్టిబాబు.. అదే రామ్ చరణ్.
ఇదండీ.... రీసెంట్ గా వినిస్తున్న ‘రంగస్థలం’ కథ. చిరంజీవి ‘ఊరికిచ్చిన మాట’ సినిమా కూడా అన్నదమ్ముల నేపథ్యంలోనే సాగుతుంది. అందులో కూడా తమ్ముడిది నెగిటీవ్ పాత్రే. అందుకే... మొదట్లో ‘ఊరికిచ్చిన మాట’ కథనే తీస్తున్నారనే పుకార్లొచ్చాయ్. నిజానికి ఈ కథ సుకుమార్ చిన్నతనంలో చూసిన కొన్ని సంఘటనల ఆధారంగా తయారు చేసుకున్న కథ అని తెలుస్తోంది. మార్చి చివరి వారంలో ఈ సినిమా విడుదల కానుంది.