పైసావసూల్ ఆడియో వేదిక వద్దకు చేరుకున్న బాలయ్య
on Aug 17, 2017
నందమూరి నటసింహం బాలకృష్ణ 101వ సినిమా పైసా వసూల్ ఆడియో విడుదల కార్యక్రమం ఖమ్మంలో ప్రారంభమైంది. వేడుకను తిలకించేందుకు ఇరు రాష్ట్రాల నుంచి నందమూరి అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు. హీరో బాలకృష్ణ చిత్ర యూనిట్తో కలిసి వేదిక వద్దకు చేరుకోగానే గ్రౌండ్ మొత్తం జై బాలయ్య..జై బాలయ్య అంటూ హోరెత్తించారు అభిమానులు.