11 కోట్లా.. అంతా అబద్దం
on Jul 6, 2017
కొన్ని రూమర్లు ఎందుకు పుడతాయో కూడా తెలీదు. అలా గాలివాటానికి వచ్చి పడుతూ ఉంటాయ్. ఇటీవల అలాంటి గాసిప్పే ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. వివరాల్లోకెళ్తే.. అక్కినేని అఖిల్ ప్రస్తుతం ‘మనం’ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వం నటిస్తున్న విషయం తెలిసిందే. తన తొలి చిత్రం‘అఖిల్‘ఫ్లాప్ అవ్వడంతో కెరీర్ విషయంలో ఆచితూచి ముందుకెళ్తున్నారట అఖిల్. అందులో భాగంగానే విక్రమ్ కుమార్ సినిమా ఓకే చేశారు. విక్రమ్ మేజిక్ తో ఆ సినిమా హిట్ అవ్వడం ఖాయం అని అందరూ నమ్మకంగా ఉన్నారు కూడా.
అయితే... విక్రమ్ కుమార్ సినిమాల్లో నటించే హీరోలకు క్లాస్ ఇమేజే తప్ప మాస్ ఇమేజ్ రాదని, దాన్ని దృష్టిలో పెట్టుకొనే నాగార్జున ఇటీవల ఓ మాస్ డైరక్టర్ని కలిశాడనీ సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపించాయి. వారనుకుంటున్న ఆ డైరక్టర్ ఎవరో కాదు బోయపాటి శ్రీను. తన కుమారునితో మంచి మాస్ సినిమా చేయాల్సిందిగా నాగ్ బోయపాటిని కోరడని, అంతే కాదు పారితోషికంగా 11 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారని కూడా మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే... నాగార్జున ఈ విషయాన్ని కొట్టి పడేశారు. 'NOT TRUE'అని తన ట్వీట్టర్లో సింపుల్ గా తేల్చేశారు నాగ్.