బాహుబలి తర్వాత డీజేనే... కుమ్మి అవతల పారేసిందిగా
on Jun 24, 2017
నిన్న విడుదలయిన అల్లు అర్జున్, పూజ హెగ్డే ల దువ్వాడ జగన్నాధం డివైడ్ టాక్ తెచ్చుకుంది. కానీ, బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఈ సినిమా మంచి జోరు మీదుంది. నైజాంలో మొదటి రోజు 4 .95 కోట్ల షేరు, 6 .75 కోట్ల గ్రాస్ సంపాదించి బాహుబలి 2 తర్వాత స్థానంలో నిలిచింది. నైజాంలో మొదటి రోజు 8 .70 కోట్ల షేర్ తో బాహుబలి 2 మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ విశేషం ఏంటంటే, డీజే కి ప్రీమియర్ షోలు వేయలేదు.
అంటే, రెగ్యులర్ షోల నుండే ఇంత మొత్తం కలెక్ట్ చేసింది. ఇంక ప్రీమియర్ షోలు కూడా పడి ఉంటే ఈ నెంబర్ ఇంకా పెద్దగా ఉండేది. ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం డీజే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మొదటి రోజు దాదాపు 18 కోట్ల షేర్ కొల్లగొట్టగా, ప్రపంచ వ్యాప్తంగా 31 నుండి 33 కోట్ల గ్రాస్ సంపాదించింది. స్టార్ హీరోల సినిమాలకి ఓపెనింగ్స్ ఎక్కువగా ఉండడం సర్వ సాధారణమైన విషయం. కానీ, మొదటి సోమవారం సినిమా ఎలా ఆడింది అనేదాన్ని బట్టి సినిమా భవితవ్యం ఆధారపడి ఉంటుంది. ఒక రకంగా ఈ సోమవారం రంజాన్ అవ్వడం డీజే కి అనుకూలించే అంశం. చూద్దాం డివైడ్ టాక్ తో ఈ సినిమా ఎంత వరకు నెట్టుకురాగలదో!