మహేష్ స్పైడర్ పై 25 కోట్లు వెచ్చించిన దిల్ రాజు
on May 29, 2017
ఇప్పుడు తెలుగులో సక్సెస్ఫుల్ నిర్మాత ఎవరు అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు దిల్ రాజు. తనకంటూ తెలుగు ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడమే కాకుండా, అది నిలబెట్టుకోవడానికి అర్ధవంతమైన సినిమాలు నిర్మిస్తున్నారు. ఏ ఆర్టిస్ట్ అయినా లేదా టెక్నీషియన్ కి అయినా జయాపజయాలు కామన్. కానీ, దిల్ రాజు తప్పులు చేసిన సందర్భాలు చాలా అరుదు. చిరంజీవి, రాఘవేంద్ర రావు లాంటి హేమాహేమీలు రాజు గారి గురించి గొప్పగా మాట్లాడారంటే, అతను ఎంత గొప్ప సినిమాలు తీసాడో అర్ధం చేసుకోవచ్చు. సినిమా నిర్మాణ రంగంలోనే కాకుండా పంపిణీ రంగంలో కూడా తన సత్తా చాటుతున్నారు. నిజాం లో అయితే, తిరుగులేని రారాజు గా పేరు తెచ్చుకున్నారు.
అసలు విషయానికి వస్తే, దిల్ రాజు మహేష్ బాబు కొత్త చిత్రం స్పైడర్ నిజాం రైట్స్ సొంతం చేసుకున్నారు. దాదాపు 25 కోట్లు కేవలం నిజాం హక్కుల కోసం వెచ్చించాడని అంటున్నారు. మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన శ్రీమంతుడు నైజాంలో 20 కోట్లు కలెక్ట్ చేసింది. దిల్ రాజు అంతకు మించి పెడుతున్నాడంటే, అయన అన్ని లెక్కలు చేసే ఉంటాడు. అయితే, స్పైడర్ బాగుంటే ఒకే... కానీ నెగటివ్ టాక్ తెచ్చుకుంటే మాత్రం దిల్ రాజు కి భారీ నష్టాలు తప్పవు. వేరే ఏరియాలకి కూడా నిర్మాతలు పెద్ద మొత్తంలో డిమాండ్ చేస్తున్నారని వినికిడి. మరి భారీ బడ్జెట్ పట్టినప్పుడు ఎక్కువ, భారీ బిజినెస్ చేస్తేనే కదా వాళ్లకూ వర్కవుట్ అయ్యేది!