బాహుబలిని చూసి.. ఆత్మహత్య చేసుకోమంటున్నాడు
on Mar 17, 2017
కాదేదు కవితకు అనర్హం అన్న సూక్తిని ఫాలో అవుతూ..కావేవి ట్వీట్కు అనర్హం అన్నట్లుగా ప్రతి విషయంపైనా..ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తూ ట్వీట్లతో విరుచుకుపడటం రామ్గోపాల్ వర్మ స్టైల్. ఈ నేపథ్యంలో ఆయన కన్ను బాహుబలి-2 ట్రైలర్పై పడింది. ట్రైలర్ని చూసిన వారందరూ ఆహో..ఓహో అంటూ..రాజమౌళి అండ్ టీంని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఈ లిస్ట్లోకి వర్మ కూడా చేరాడు.
తాను కూడా బాహుబలి-2 ట్రైలర్ చూశానని..టేకింగ్ సూపర్బ్, మైండ్ బ్లోయింగ్ అంటూ జక్కన్నను ఇతర టెక్నీషియన్స్ని ప్రశంసించాడు. అయితే అందిరిలా మాట్లాడితే వర్మ ఎందుకు అవుతాడు. అందుకే ట్రైలర్ని అడ్డుపెట్టుకొని మిగతా టాలీవుడ్ స్టార్లను టార్గెట్ చేశాడు రామూ. బాహుబలి-2 ట్రైలర్ 5 కోట్ల వ్యూస్ని సాధించడంతో ఆ ఫిగర్ చూసి ఎంతమంది టాలీవుడ్లో ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటారోనని భయంగా ఉంది అంటూ ట్వీట్ చేశాడు. అయితే ఇంతవరకు ఈ ట్వీట్పై ఎవరూ స్పందించలేదు.